గతంలో సోషల్ మీడియాలో సింగర్ సునీత సందడి కాస్త తక్కువగానే ఉండేది. కానీ ఆమె రెండో పెళ్లి మొదలైంది మొదలు ఇక రోజుకో వార్తతో మన ముందుకు వస్తోంది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను రెండో పెళ్లి
చేసుకుంది. పెళ్లికి సంబంధించిన చాలా ఫంక్షన్ లలో చాలా బిజీగా ఉన్న సునీత త్వరలో రామ్ తో కలిసి హనీమూన్ కి కూడా వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  తన పెళ్లి తో బాగా హడావిడిగా మారిపోయిన సునీత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు.

కాగా ఉన్నట్టుండి తన న్యూ లుక్ ఫోటో ను షేర్ చేసింది. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిక్ లో సునీత సేదతీరుతూ హాయిగా కాఫీ తాగుతున్నట్లు కనిపించింది. ఈ ఫోటో చూసిన వారందరూ బ్యూటిఫుల్ పిక్. మీరు ఒక్కరే ఉన్నారు రామ్ గారు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. మీరు రామ్ కలిసిన ఫోటోలు షేర్ చేయాలని అభిమానులు అడుగుతున్నారు. స్టార్ సింగర్ సునీత రెండో వివాహం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈమె రెండో పెళ్లి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఈ పని ఏంటి అంటూ... విమర్శలు గుప్పిస్తున్నారు.

కానీ రెండు విషయాలను పక్కనపెట్టి తను నిర్ణయించుకున్న కొత్త జీవితంలో ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతోంది సునీత. తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను అని ముందే క్లారిటీ ఇచ్చిన సునీత ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలను ముందుగానే ఊహించింది. అందుకే వీటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది సింగర్ సునీత. ఎప్పటిలాగే పెళ్లి తరువాత కూడా తన మధురమైన పాటలతో మనలను అలరించాలని అలాగే తన కొత్త జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: