అయితే తాజాగా ఈ హీరో తన పాత రోజులను గుర్తుకు చేసుకుని బాధపడుతున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా బాధపడ్డానని విజయ్ దేవరకొండ తెలుపుతున్నాడు. ఈ హీరోకు ప్రస్తుతమున్న క్రేజ్ ను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఈ హీరో. యూత్ ఐకాన్ గా మారిన ఈ రౌడీ హీరో పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న‘లైగర్’ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అనన్యపాంండే కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ నుు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ను చూసిన అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఫుల్ మాస్ లుక్ తో కనిపించిన విజయ్ దేవరకొండ పోస్టర్ పై పాలాభిషేకాలు, పూల వర్షం, హారతులు ఇచ్చారు.
దాంతో పాటుగా తీన్ మార్ డ్యాన్సులు, కేక్ కటింగ్స్ లో ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఒకరకంగా చెప్పాలంటే తమ హీరో అలా కనిపించడంతో ఫ్యాన్స్ కు పండుగ వాతావరణమే ఏర్పడింది. ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు విజయ్ దేవరకొండ ఎంతో సంతోషంగా ఫీలయ్యి.. భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘లైగర్’ పట్ల చూపిస్తున్న ప్రేమతో మీరు నన్ను భావోద్వేగానికి గురిచేశారు. నా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా నటనకు గుర్తింపు వస్తుందో రాదో నని ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా బాధపడేవాడిని. కానీ ‘లైగర్’ పోస్టర్ విడుదల సందర్భంగా మీరు చూపిన ప్రేమతో నాకు ఆనందంగా ఉంది. ఒక ఈ లైగర్ టీజర్ విడుదలైనప్పుుడు కూడా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి.. చూడండి.. ఈ నా మాటలను గుర్తుపెట్టుకోండి’ అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ.