అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ లతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. సత్యం శివం సుందరం సినిమాలో తను ఎన్టీఆర్ తో పాటు ఏఎన్ఆర్ తో కూడా కలిసి నటించాలని.. వారితో కలిసి నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని అన్నారు. 'నేను ఎక్కడా కూర్చుంటే నువ్వు కూడా అక్కడే కూర్చోవాలి. నేను ఏం తింటే నువ్వు కూడా అదే తినాలి' అని ఎన్టీరామారావు తనకు రూల్స్ పెట్టారని భానుచందర్ చెప్పి ఆశ్చర్యపరిచారు. "ఎన్టీఆర్ తనతో సమానంగా నన్ను ట్రీట్ చేస్తూ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.. దానికి కారణం మా తల్లి గారే" అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.
భానుచందర్ తల్లిని అక్కయ్య అని ఎన్టీఆర్ పిలిస్తే.. ఆమె ఎన్టీఆర్ ని అన్నయ్య అని పిలిచేవారట. ఐతే ఒకరోజు ఎన్టీరామారావు భానుచందర్ తల్లి కి ఫోన్ చేసి "మాకు పచ్చకామెర్ల అయ్యాయి. మీరు మందు ఇస్తారని తెలిసింది. ఏ టైంలో ఇంటికి రమ్మంటారు" అని అడిగారట. దీంతో భానుచందర్ తల్లి బదులిస్తూ.. "అయ్యో అన్నయ్య గారు మీరు రావాల్సిన అవసరం లేదు నేనే మీ ఇంటికి రేపు ఉదయం నాలుగున్నర గంటల సమయంలో వచ్చి పచ్చ కామెర్లకు మందు ఇస్తాను" అని చెప్పారట. దీనితో ఎన్టీఆర్ కూడా 4:30 గంటల సమయంలో రెడీగా ఉంటాను అని ఎన్టీఆర్ చెప్పారు.
మరుసటిరోజు భానుచందర్ తల్లి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి కామెర్ల మందు కలిపిన వేడివేడి ఇడ్లీలను రామారావు కి ఇచ్చారు. ఆ తర్వాత మరో రెండు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం వచ్చి వేడివేడి ఇడ్లీలను ఇవ్వగా ఎన్టీఆర్ కి మూడురోజుల సమయంలోనే పచ్చకామెర్లు తగ్గిపోయాయి. అయితే కొంతకాలం తర్వాత బాలకృష్ణ కి కూడా పచ్చకామర్లు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి పంపించకుండా మళ్లీ భానుచందర్ తల్లి ని పిలిపించి పచ్చ కామెర్ల మందు బాలకృష్ణకి తినిపించారు. తనకి కూడా మూడు రోజుల వ్యవధిలోనే పచ్చకామెర్లు తగ్గిపోయాయి. అయితే భానుచందర్ తల్లి.. ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి ఉచితంగానే వైద్యం చేశారు. దీనితో రామారావు కి ఆమె పట్ల చాలా గౌరవం మర్యాద ఉండేవి. అందుకే ఆమె కుమారుడైన భానుచందర్ ని చాలా ప్రేమగా చూసుకునే వారు