యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాకు సీక్వెల్ గా తెరకెకుతున్న ఈ మూవీ పై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇక చాప్టర్ 1 ఎంతటి గొప్ప విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసందే. పాన్ ఇండియా మూవీ గా కన్నడ సహా పలు భారతీయ భాషల్లో రీలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదటి భాగాన్ని మించేలా ప్రస్తుతం రెండవ భాగాన్ని మరింత అత్యద్భుతంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితర దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం ఆవుతున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల రీలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి విపరీతమైన స్పందన రావడంతోపాటు మూవీ పై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచింది. నిజానికి ఈ సినిమా గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడడంతో రిలీజ్ ని కూడా వాయిదా వేశారు. అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కానుందని, అలానే పక్కాగా రిలీజ్ డేట్ అతి త్వరలో అఫీషియల్ గా వెల్లడికానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఈ మూవీ కోసం ఎప్పటినుండో ఎదురు చూపులు చూస్తున్న ప్రేక్షకాభిమానులకు ఇది మంచి పండుగ న్యూస్ అనే చెప్పాలి...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: