తొలిసారిగా టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాపవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో పాన్ ఇండియా మూవీ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని దాదాపుగా రూ. 500 కోట్ల భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా దర్శక దిగ్గజం రాజమౌళిమూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. రాం చరణ్ అల్లూరి సీతారమరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈసినిమాలోని హీరోలిద్దరి పరిచయ టీజర్స్ రెండూ కూడా విపరీతమైన రెస్పాన్స్ ని దక్కించుకుని మూవీ పై ప్రేక్షకాభిమానుల్లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పరిచాయి. ఆలియా భట్, ఒలివియ మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథని సమకూరుస్తున్నారు.

ఇప్పటికే చాలవరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రీలీజ్ కానున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం ఈ సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని నిన్న యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ క్లైమాక్స్ కోసం దాదాపుగా రూ. 30 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని, దాదాపుగా పదిహేనువేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ భారీ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారని అంటున్నారు. ఇక ఈ సీన్ లో హీరోలిద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు ఎంతో అద్భుతంగా నటిస్తున్నట్లు టాక్. దాదాపుగా ఈ ఎపిసోడ్ కోసం మొత్తంగా ఇరవై రోజులకు పైగా చిత్రీకరణ కొనసాగనుందని అంటున్నారు. సినిమాలోని ప్రధానమైన సన్నివేశాల్లో క్లైమాక్స్ సీన్స్ కూడా ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయని, తప్పకుండా రిలీజ్ తరువాత తమ సినిమా అందరి అంచనాలు అందుకుని భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని మూవీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రేపు రిలీజ్ తరువాత ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: