అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో క్రేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఆ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతి చిత్రానికి అంచనాలు భారీగా ఉంటున్నాయి. ఇక తాజాగా తన కొత్త చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదలైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రానికి లైగర్ అనే టైటిల్ పెట్టగా.. ఈ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొన్ని చోట్ల విజయ్ దేవరకొండ పోస్టర్‌కు బీర్‌తో అభిషేకం చేసిన సంఘటనలు కూడా నెలకొన్నాయి. ఇక లైగర్‌కు వచ్చిన స్పందనపై విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశాడు.

‘నా సినిమాలు థియేటర్‌లో చూడటానికి అసలు ఎవరైనా వస్తారా? నన్ను అసలు నటుడిగా గుర్తిస్తారా?’ అని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోజుల్లో తాను ఎంతగానో బాధపడే వాడినన విజయ్ దేవరకొండ చెప్పాడు. కానీ లైగర్ టైటిల్, ఫస్ట్ లుక్‌కు వచ్చిన స్పందనను చూసిన తరువాత తాను ఎంతో సంతోషించానని ఈ రౌడీ బాయ్ చెప్పుకొచ్చాడు. ‘లైగర్ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలైన రోజు మీరంతా నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేశారు. టీజర్ విడుదలైనప్పుడు కూడా దేశ వ్యాప్తంగా ఇలాంటి వేడుకలే జరుగుతాయి’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.  

కాగా.. లైగర్ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్, పూరీ జగన్నాథ్ స్వంత సంస్థ పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కరణ్ జోహార్‌పై బాలీవుడ్ ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్ చిత్ర పోస్టర్ విడుదలైన తరువాత కూడా బాలీవుడ్ ప్రేక్షకులు లైగర్ పోస్టర్‌పై విపరీతమైన ట్రోల్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: