ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా తమన్ పేరే వినిపిస్తుంది. తెలుగు నుంచి వచ్చే క్రేజీ సినిమాలు అన్నీ తమన్ చేతిలోనే ఉన్నాయంటే తమన్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కాలంలో భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు తమన్. రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతున్నాడు. అలవైకుంఠపురం సినిమా తో ఒక్కసారిగా తమన్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఆ సినిమా లోని అన్ని పాటలు హిట్ కావడంతో ఇతరభాషలనుంచి కూడా ఆయనకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. ట్యూన్లు కాపీ అంటూ ఎలాంటి విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా దర్శక నిర్మాతలు తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవం విశేషం..

తెలుగులో నిర్మాణంలో ఉన్న పది భారీ సినిమాల్లో కనీసం ఆరింటికి తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండటం అతిశయోక్తి కాదు. తాజాగా మరో భారీ సినిమా ఆఫర్ తమన్ కి వచ్చిందట. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లూసిఫర్ సినిమా కి తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు.. ఈ విషయం అధికారికంగా ప్రకటించబడింది. తనే స్వయంగా అఫీషియల్ గా ట్వీట్ చేసి మరీ సంతోషాన్ని పంచుకున్నాడు. తన కల నిజం కాబోతోందని ఆనందం వ్యక్తం చేశాడు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేస్తున్న తమన్, ఈ సినిమా తో పాటు సాయి ధరమ్ తేజ్ సినిమాకి, వరుణ్ తేజ్ గని సినిమా కి సంగీతం అందిస్తున్నాడు.. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి అవకాశం రావడంతో తమన్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సైతం సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు.  మ్యూజిక్ సిటింగ్స్ కూడా మొదలైపోయాయని ట్వీట్ ని బట్టి అర్థమవుతోంది. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా నయనతార ని అనుకుంటుండగా సత్యదేవ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: