'విన్నర్' సినిమా తర్వాత గోపీచంద్ మలినేనికి కాస్త గ్యాప్ వచ్చింది. యంగ్ హీరోలు స్టార్ హీరోలు చాలా మంది ఆయన్ను దూరం పెట్టారు. కథ వినేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. అలాంటి సమయంలో రవితేజ ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఇద్దరి కాంబోలో అప్పటికే రెండు సినిమాలు రావడంతో మరో సినిమా చేస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అనుకున్నారు. రవితేజ కెరీర్ లో కూడా ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో గోపీచంద్ తో సినిమా చేయడం వల్ల గాడిన పడవచ్చు అని భావించి చేసింది 'క్రాక్'. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. సంక్రాంతి విన్నర్ గానే కాకుండా కరోనా విన్నర్ గా కూడా క్రాక్ నిలిచింది అంటూ మొత్తం దేశ వ్యాప్తంగా ఇప్పుడు క్రాక్ గురించి మాట్లాడుకుంటున్నారు. మహమ్మారి కరోనా కారణంగా సుదీర్ఘమైన బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ తర్వాత వచ్చిన సినిమానే ఇది. ఈ సినిమా విజయంతో గోపీచంద్ మలినేని మరియు రవితేజలు మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.


క్రాక్ సక్సెస్ నేపథ్యంలో చాలా మంది స్టార్స్ కూడా గోపీచంద్ మలినేనితో సినిమాను చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. క్రాక్ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా కాకుండానే కొత్త సినిమాకు గోపీచంద్ మలినేని సైన్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారు స్టార్ హీరో తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న ఆ స్టార్ హీరో ఎవరు అనేది అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క హీరో మూవీనే కాకుండా ఈ ఏడాదిలోనే గోపీచంద్ మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా క్రాక్ ఎఫెక్ట్. మరో వైపు రవితేజ కూడా తన పారితోషికం పెంచేసి రెండు సినిమాలకు సైన్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: