కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది హీరోల సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిస్ అయిపోయారు. వీరిలో అల్లరి నరేష్ కూడా ఒకరు. అల్లరి నరేష్ చివరి చిత్రం సినిమా థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. అల్లరి నరేష్ సినిమా విడుదలై అన్ని నెలలు గడిచిందని చెప్పాలి. ఇక తాజాగా అల్లరి నరేష్ చాలా గ్యాప్ తర్వాత రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బంగారు బుల్లోడు చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుందని అనుకోగా.. కాస్త గ్యాప్ తీసుకుని ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. పి.గిరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

గతంలోనూ అల్లరి నరేష్ చాలా సినిమాలకు ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇక ఇదిలా ఉంటే.. బంగారు బుల్లోడు సినిమా టైటిల్‌ను అల్లరి నరేష్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా బంగారు బుల్లోడు నుంచి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పెట్టుకోవడమే కాకుండా అందులోని చార్ట్ బస్టర్ స్వాతిలో ముత్యమంత సాంగ్ ని కూడా ఈ సినిమాలో వాడేసుకున్నారు. ఈ రీమిక్స్ సాంగ్ కి సంబంధించిన ప్రోమోని కూడా చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సహజంగా రీమిక్స్ పాటలు వచ్చినప్పుడు మెయిన్ వెర్షన్‌లో నటించిన హీరో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు.

తమ అభిమాన నటుడి పాటను వేరొకరు రీమేక్ చేస్తున్నారంటూ చెప్పుకుంటారు. కానీ.. బంగారు బుల్లోడు చిత్రంలో దీనికి భిన్నంగా జరుగుతోంది. బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిన 'స్వాతిలో ముత్యమంత' పాటను రీమేక్ చేసి ఆ పాటను చెడగొట్టారంటూ బాలయ్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సాంగ్స్ మధ్య కంపారిజన్స్ వచ్చినప్పటికీ మరికొందరు మాత్రం రీమిక్స్ ని బాగానే డీల్ చేసారని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. బంగారు బుల్లోడు టైటిల్‌తో పాటు స్వాతిలో ముత్యమంత పాటను ఈ సినిమాలో వాడుకునేందుకు ముందుగా చిత్ర యూనిట్ నందమూరి బాలకృష్ణ అనుమతిని తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: