బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ వల్ల థియేటర్స్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్లో ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద స్టార్ హీరో సినిమా అక్షయ్ కుమార్దే. ఆయన నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ’ను డిస్నీ హాట్స్టార్లో నేరుగా విడుదల చేశారు. కానీ ఆ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ టాక్ రాలేదు. దాని తరువాత నిర్మాతగా భాగమతి సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా నిరాశ పరిచింది.
ఈ సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే అక్షయ్ ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బెల్ బాటమ్ అని పేరును ఖరారు చేశారు.ఇక సినిమా నిర్మాతలు అక్షయ్ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ విడుదల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతున్నారు.ఒకవేళ ఈ చర్చలు పూర్తయితే ఈ సినిమా ఆన్లైన్ స్ట్రీమింగ్గా విడుదల కానుంది. అమెజాన్ ఇచ్చిన ఆఫర్కు సినిమా నిర్మాతలు టెంప్ట్ అయినట్లున్నారు. అయితే ఆఫర్ ఇంకాస్త పెరిగితే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్పై వచ్చే నెల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.ముందుగా ఈ మూవీని 2021 ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..