బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ని మినీ ఇండస్ట్రీగా పిలుస్తారు. ఆయన ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూబిజీగా ఉంటారు. ఈ రకంగా ఏడాదికి కేవలం అక్షయ్‌ కుమార్‌ సినిమాలపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అత్యంత సంపాదన కలిగిన స్టార్‌గా ఫోర్బ్స్ లోకి కూడా అక్షయ్‌ ఎక్కారు.అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ వరసగా సినిమాలు లైన్లో పెట్టాడు . మిగతా హీరోలు ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’, ‘బచ్చన్ పాండే’, ‘బెల్ బాటమ్’ సినిమాలు చేస్తున్నాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ‘బెల్ బాటమ్’ చిత్రానికి రంజిత్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ వల్ల థియేటర్స్‌లో రిలీజ్‌ కావాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్‌లో ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద స్టార్‌ హీరో సినిమా అక్షయ్‌ కుమార్‌దే. ఆయన నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌ ‘లక్ష్మీ’ను డిస్నీ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల చేశారు. కానీ ఆ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ టాక్ రాలేదు. దాని తరువాత నిర్మాతగా భాగమతి సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా నిరాశ పరిచింది.

 ఈ సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే అక్షయ్ ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బెల్ బాటమ్ అని పేరును ఖరారు చేశారు.ఇక  సినిమా నిర్మాతలు అక్షయ్ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ విడుదల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతున్నారు.ఒకవేళ ఈ చర్చలు పూర్తయితే ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌గా విడుదల కానుంది. అమెజాన్ ఇచ్చిన ఆఫర్‌కు సినిమా నిర్మాతలు టెంప్ట్ అయినట్లున్నారు. అయితే ఆఫర్ ఇంకాస్త పెరిగితే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై వచ్చే నెల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.ముందుగా ఈ మూవీని 2021 ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఓటీటీలో రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: