అందాల నటి ఆనాటి సీనియర్ హీరోయిన్ మీనా గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మీనా గురించి నాటి నుంచి నేటి వరకు ఎవరిని అడిగినా  ఇట్టే చెప్పేస్తారు. ఈమె తన నటనతో,అందంతో, నగుమోముతో,ఆహార్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీనా అంటే విపరీతమైన పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీనా తొలుత బాలనటిగా తెలుగు,తమిళ చిత్రాలలో సినీరంగ ప్రవేశం చేసింది. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్, తదితర  స్టార్ నటులతో నటించి,ఆ తరువాత కథానాయికగా ఎదిగింది. ఈమె కేవలం తెలుగు,తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా దక్షిణ భారత భాషా  సినిమాల్లో నటించింది. అంతేకాకుండా కొన్ని హిందీ చిత్రాలలో కూడా ఈమె నటించడం గమనార్హం.

మీనా తమిళ సినిమాలు  అయినా ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి లాంటి ఎన్నో చిత్రాలు ఆమెను  మంచి స్థానంలో నిలబెట్టాయి. ఇక తెలుగు విషయానికి వస్తే "సీతారత్నం గారి మనవరాలు" ఈమెకు భారీ పాపులర్ హిట్ ను చేకూర్చి పెట్టింది. ఇక వెంకటేష్ సరసన సుందరకాండ,చంటి,సూర్యవంశం, అబ్బాయిగారు వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఎన్నో సినిమాలు తీసిన తర్వాత ఈమె విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు మీనా. ఇక ఆ తర్వాత కూడా రీసెంట్ గా కొన్ని బుల్లితెర ప్రోగ్రామ్స్ లో కూడా యాంకర్ గా మెరిసింది.ఇదిలా ఉండగా మీనా " ఆ పని చేసినందుకు గర్వంగా ఉందని" సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం,ఇప్పుడు ఆ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పని ఏమిటో ఇప్పుడు చూద్దాం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు  ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ "నేటికీ కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో సినీ,రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని ప్రసాదించవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ  తమ వంతుగా మొక్కలను నాటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటాల్సిందిగా పలువురు ప్రముఖులు చెప్పుకొచ్చారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్, బిగ్ బాస్ షో  4 ఫేమ్ దేవి నాగవల్లి ఇచ్చిన చాలెంజ్ ను  స్వీకరించి, 2021 జనవరి 18న చెన్నైలోని సైదాపేట్  లోని తన నివాసంలో మొక్కలు నాటారు హీరోయిన్ మీనా.ఈ సందర్భంగా మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలు పై స్పందిస్తూ.." ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి నా అభినందనలు" అని తెలుపుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: