దర్శకుడు శంకర్ అనగానే ఆయన  దర్శకత్వంలో వచ్చే ఏ సినిమాలోనైనా ఒక విభిన్నమైన కథతో, ఎవరూ ఊహించని సరికొత్త శైలిలో మన ముందుకు వస్తాడు అని అందరికీ తెలుసు. తొలుత 1993లో అర్జున్ హీరోగా "జెంటిల్ మేన్" సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ  సినిమా అత్యంత భారీ విజయాన్ని సాధించడంతో పాటు, శంకర్ కు బెస్ట్ ఫిలింఫేర్ డైరెక్టర్ అవార్డును  కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్,ఒకే ఒక్కడు, అపరిచితుడు,శివాజీ,రోబో,స్నేహితుడు లాంటి ఎన్నో సినిమాలు తీసి సంచలనం సృష్టించాడు డైరెక్టర్ శంకర్. ఈ  సినిమాలకు గాను డైరెక్టర్ శంకర్ కు చాలాసార్లు బెస్ట్ డైరెక్టర్ అవార్డు తో పాటు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా లభించాయి.

శంకర్ కేవలం తొలుత తమిళ డైరెక్టర్ అయినప్పటికీ, తెలుగు సినిమాలలో కూడా దర్శకత్వం వహించి సంచలనం సృష్టించాడు. శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. కొన్ని తమిళ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు సరికొత్తగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి కథ సిద్ధం చేసుకున్నాడట ఎస్ శంకర్.

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ "అనే సినిమాతో హీరోగా  సినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలను  తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు అందరూ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడం ఖాయమని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో ప్రక్క పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన మరో సంచలన వార్త అభిమానుల్లో ఊహాగానాలను రెట్టింపు చేసింది. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా డైరెక్టర్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు.
అలాంటిది కాస్త పేరున్న డైరెక్టర్ తో సినిమా చేస్తే, ఆ అంచనాలు కానీ,ఆ సినిమా క్రేజ్ ని కానీ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇక అలాంటిది టాప్ త్రీ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ లాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఇక అది ఊహకు కూడా అందని విషయం. అయితే ఈ ఊహ త్వరలోనే నిజం కాబోతోంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే డైరెక్టర్ శంకర్ ఇటీవలే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ను సిద్ధం చేశాడని,ఇద్దరు హీరోలు నటించే స్కోప్ ఉన్న కథలో  రామ్ చరణ్ హీరోగా నటించబోతున్నాడు అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటికే ఈ కథ రామ్ చరణ్ కి  వినిపించగా, ఆయన  ఈ కథ ఎంతో నచ్చిందని చెప్పడంతో ఇక త్వరలోనే ఈ కథను పవన్ కళ్యాణ్ కు కూడా  వినిపించబోతున్నాడు  డైరెక్టర్ శంకర్. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నచ్చితే, వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళుతుందని జాతీయ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: