2020 లో కరోనా రావడం సినిమాలకు బ్రేక్ పడటంతో టాలీవుడ్ యంగ్ హీరోలు, హీరోయిన్లు ఒకింటి వాళ్లయ్యారు. అందులో రానా దగ్గుపాటి, నితిన్, కాజల్ అగర్వాల్, మెగా డాటర్ నిహారిక కొణిదెల లు పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి ఆహ్వానం పలికారు. వైవాహిక జీవితంతో వీళ్లంతా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి సినిమా షూటింగ్ షురూ అయినా టైం కుదిరినప్పుడల్లా వారి జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయిస్తూ సరదాగా గడుపుతున్నారు. ఈ జంటలంతా ఎంజాయ్ చెయ్యడానికి అప్పుడప్పుడు పర్యాటక ప్లేసెస్ కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ప్రేమ వివాహం చేసుకున్న భల్లాలదేవుడు కూడా తన వైవాహిక జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసేస్తున్నాడు. వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కొంచెం బ్రేక్ వచ్చిందంటే చాలు ఆ సమయాన్ని కాస్త తన నిచ్చెలికి కేటాయించి ముచ్చటలాడుతున్నాడు. ఎన్నో తీపి గుర్తులను పోగుచేసుకునే పనిలో పడ్డాడు ఈ ఆరడుగుల అందగాడు. తనతో ఏడడుగులు వేసి వచ్చిన తన ప్రేయసికి.. తమ ప్రేమ బంధానికి మర్చిపోలేని ఒక కొత్త రూపం ఏర్పరి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు రానా దగ్గుపాటి. రానా అతని సతీమణి మిహికాలు వారి వైవాహిక బంధానికి చిరకాల గుర్తుగా త్రీడీ మోడల్ ను తయారుచేయించుకున్నారు.

 ఈ త్రీడీ మోడల్ ను రానా తన అభిమానులతో పంచుకున్నారు. కాగా ఈ మోడల్ ను ప్రముఖ ఆర్టిస్ట్ భావనా జస్ర తయారు చేసింది. ఇందులో రానా, మాహికాలు ఒకరి చేయి మరొకరు పట్టుకున్న మౌల్డ్ ను తయారు చేయించారు. దీనికి బంగారు పూత కూడా పూసారు. ఈ త్రీడి మోడల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. రానా, మిహికాలు2020 లో ఆగస్టు 8 న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కాగా ప్రస్తుతం ఈ హీరో అరణ్య, విరాటపర్వం సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: