రేణు దేశాయ్ తన ఆధ్యాత్మిక అవతారంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఫ్రెండ్స్ తో వారణాసికి వెళ్లిన రేణు దేశాయ్ తన లుక్ ను కంప్లీట్ గా ఛేంజ్ చేసుకుంది. ఒక సన్యాసిని అవతారంలో కనిపించింది.

నుదుటిపై విభూతి బొట్టు అలాగే లూజ్ హెయిర్ తో షాకిచ్చింది. భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. ఈ మాంక్ లుక్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి  'స్పిరిట్యువల్ గా ఉండండి, రిలీజియస్ గా కాదు' అన్న క్యాప్షన్ పెట్టింది. కాశి అలాగే వారణాసి డైరీస్ అన్న హ్యాష్ ట్యాగ్స్ ను జతచేసింది. గంగా నదికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే, "జానీ" తరువాత వెండితెరపై కనిపించని రేణు దేశాయ్ మళ్ళీ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ లో రేణు లీడ్ రోల్ పోషిస్తోంది. రైతుల ఇబ్బందులను ఫోకస్ చేసే విధంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు రేణు ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ఇదిలా ఉంటే, మహేష్ నటిస్తున్న 'సర్కారు వారి పాట'లో రేణు కీలకపాత్రలో కనిపిస్తోందన్న న్యూస్ వినిపిస్తోంది. ఈ న్యూస్ ను ఖండించింది. తాను ఈ సినిమాలో మహేష్ కు అక్కగా నటించడం లేదని స్పష్టం చేసింది రేణు దేశాయ్.

ఇక రేణు దేశాయ్ ఆధ్యాత్మికతకు దగ్గరవాడనికి పవన్ కళ్యాణ్ కారణమని అంటున్నారు ఆమె సన్నిహితులు. పవన్ కూడా ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడని వీళ్లిద్దరి మధ్య ఈ డిస్కషన్స్ బాగా నడిచేవని అందుకే రేణుపై ఆ ప్రభావం పడిందని టాక్ నడుస్తోంది.

ఇక, ఈ వారణాసి పోస్ట్లో రేణు కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి. మతతత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు మళ్ళీ వార్తల్లో వ్యక్తిగా మారింది.

ఇదిలా ఉంటే, రేణు మోడలింగ్ నుంచి యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పవన్ తో రేణు నటించిన "బద్రి" సినిమా ఇప్పటికీ అందరినీ అలరిస్తోంది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. రేణు వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: