టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ మారుతి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి కామెడీ పండించడంలో మారుతి నేర్పరి, దర్శకుల మాట విని ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడంలో గోపీచంద్ నేర్పరి, సో వీరిద్దరి కాంబినేషన్ అనగానే జనాల్లో కాస్త ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సినిమా మారుతి ముందుగా మాస్ మహారాజ రవితేజతో చేయాల్సి ఉంది. జనవరి చివరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి ఉంది. 


అయితే రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో రవితేజ ఈ సినిమాని చేయనని తప్పకున్నాడు. దీంతో అదే కధతో గోపీచంద్ ని ఒప్పించి సినిమా లైన్లో పెట్టాడు మారుతి. అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో గోపీచంద్ ఇబ్బంది పడుతున్నాడట. ఈ సినిమాలో ముందుగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటింపచేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆమె వద్దని చెప్పి గోపీచంద్ అడ్డం తిరిగాడని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరూ కలిసి గతంలో జిల్ అలాగే ఆక్సిజన్ అనే రెండు సినిమాలు చేశారు. దాదాపు ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.


మరో సారి అమ్మడితో సినిమా అంటే సెంటిమెంటల్ గా వర్కవుట్ కాదని ఆమె వద్దని గోపీ కోరాడట. ఆమెకి ఈ సినిమాలు మాత్రమేగాక వరుసగా శ్రీనివాస కళ్యాణం, అయోగ్య, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్  సినిమాలు కూడా ఫ్లాప్ లే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి రిస్కు చేయొద్దని నిర్మాతలకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడట. తాను కూడా ప్లాప్స్ ఉన్న కారణంగా మరింత రిస్కు చేయలేనని అని ఆయన చెప్పుకొచ్చారట. ఈ మాటలతో కన్విన్స్ ఆయన దర్శక నిర్మాతలు వేరే హీరోయిన్ వెతికే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: