సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడైతే అనారోగ్యం పాలయ్యారో అప్పటి నుంచి రజిని ఫ్యాన్స్ కి అన్నీ చేదు వార్తలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి రానని ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమా కూడా నిరవధిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో రజనీకాంత్ అన్నాత్తే అనే సినిమా చేస్తున్నాడు. నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఏడుగురు యూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

అలా తేలిన కొద్ది రోజుల తరువాత రజినీకాంత్ కి తీవ్ర అస్వస్థత చోటుచేసుకుంది. దీంతో అప్పటికప్పుడు ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యం దృష్ట్యా ఏకంగా ఆయన రాజకీయాల్లోకి కూడా రానంటూ ప్రకటన చేసి అభిమానులు అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు శివతో ఈ సినిమా మొదలు పెట్టడానికి ఇంకా సమయం పడుతుందని రజనీ ఫ్యామిలీ తేల్చి చెప్పేశారట. దీంతో శివ సూర్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే సూర్యకు కథ చెప్పి వినిపించగా ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీంతో షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా శివ ప్రారంభించారని అంటున్నారు. రజనీకాంత్ సినిమా జూన్ లేదా జులై నెలల్లో మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లోపు సూర్యతో సినిమా పూర్తి చేయాలని శివ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. సూర్య ఇమేజ్ కి తగ్గ కథ కావడంతో కథ విన్న వెంటనే ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: