టాలీవుడ్‌లో రీమేక్ సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 80 శాతం రీమేకులే ఉన్నాయిప్పుడు. తాజాగా లూసీఫర్ రీమేక్ కూడా మొదలు పెట్టాడు మెగాస్టార్. మరోవైపు పవన్ కూడా వరస సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో ఓ పాపులర్ కొరియన్ సినిమా రిమేక్ కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాణ సంస్థ.. ఆ సినిమా ఇండియన్ భాషల రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది కూడా.

అది ఎవరంటే ఇటీవలే కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ని సమంతతో ‘ఓ బేబి’గా తెరకెక్కించింది సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల మందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం తెలుగులో రీమేక్ సినిమాల జోరు పెరిగిపోతుంది. అటు తెలుగు చిత్రాలను పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. తాజాగా, కొరియన్ భాషకు చెందిన చిత్రం “లక్కీ కీ” అనే సినిమాకు అధికారికంగా రీమేక్ చేస్తున్నట్టుగా తెలిపారు. కామెడీ అండ్ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ చిత్రం తాలూకా అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను తాము కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు.2012లో విడుదలైన ‘కీ ఆఫ్‌ లైఫ్‌’ అనే జపనీస్‌ చిత్రాన్ని ‘లక్కీ కీ’ పేరుతో కొరియన్‌ పరిశ్రమ రీమేక్‌ చేసింది.


ఇప్పుడు ఈ కొరియన్‌ సినిమా ఆధారంగా తెలుగు రీమేక్‌ రూపొందనుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యాక్టర్, కిరాయికి హత్యలు చేసే రౌడీ అనుకోకుండా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తే ఏం జరిగింది? అనేది ఈ చిత్రకథాంశం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, ఇందులో ఓ పెద్ద స్టార్‌ నటిస్తారని ప్రకటించారు.ఆ ప్రముఖ నటుడు ఎవరనేది చెప్పలేదు. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే నాగ చైతన్య పేరు తెరపైకి వచ్చింది. ఇందులో చైతూ హీరోగా నటించబోతున్నాడని.. ఓ కుర్ర దర్శకుడు సినిమా బాధ్యతలు తీసుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి.గురు ఫిలింస్, యస్‌ కే గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలసి సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: