ఈ సినిమా ద్వారా స్వీటీ భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన హీరోయిన్ గా గుర్తింపు కూడా తెచ్చుకుంది. దీనితో పాటుగా అనుష్క ప్రధాన పాత్రలో కనిపించిన ‘అరుందతి’ సినిమా ఆమెకు ఒక మైలు రాయనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాతే అనుష్క ప్రఖ్యాత నటిగా గుర్తింపు సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ జేజమ్మ కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ద్వారా స్వీటీకి విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఇకపోతే ఈ స్వీటీకి సైజ్ జీరో సినిమా తర్వాత సినిమా అవకాశాలు రావడం లేదనేది వాస్తవం. ఆ సినిమా కోసం స్వీటీ విపరీతంగా బరువు పెరిగింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి.
అయితే 2020 సంవత్సరంలో అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ చిన్నది ప్రస్తుతం రారా కృష్ణయ ఫేమ్ పి మహేష్ దర్శకత్వంలో సినిమా తీసేందుకు సిద్దమైందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికోసమే స్వీటీ వర్కౌట్స్ కూడా మొదలు పెట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. సన్నగా మారి తన అభిమానులను అశ్చర్యపరచడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలా మారిపోతేనన్నా స్వీటికీ మునపటిలా అవకాశాలు వెల్లువెత్తుతాయో లేదో చూడాలి మరి..