తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్నిసంపాదించింది అనుష్కా శెట్టి. తమిళ ఇండస్ట్రీ సంగతి పక్కన్నపెడితే తెలుగు ఇండస్ట్రీలో అబ్బురపరిచే నటన ద్వారా ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకుంది ఈ జేజమ్మ. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా ఈ చిన్నది టాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం వంటి సినిమాల్లో నటించి ఘన విజయాన్ని  కూడా సాదించింది. ఆ తర్వాత ఈ బ్యూటీక్వీన్ కు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.  తన నటనా ప్రతిభతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అనుష్క శెట్టి. టాప్ హీరోల సరసన నటించాలంటే మాత్రం ముందుగా డైరెక్టర్లు కూడా ఈ చిన్నదానికే ఆ అవకాశం  ఇచ్చేవారు. అందులో ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఈ చిన్నదాని రేంజే మారిపోయింది.
సినిమా ద్వారా స్వీటీ భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన హీరోయిన్ గా గుర్తింపు కూడా తెచ్చుకుంది. దీనితో పాటుగా అనుష్క ప్రధాన పాత్రలో కనిపించిన ‘అరుందతి’ సినిమా ఆమెకు ఒక మైలు రాయనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాతే అనుష్క ప్రఖ్యాత నటిగా గుర్తింపు సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ జేజమ్మ కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా ద్వారా స్వీటీకి విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఇకపోతే ఈ స్వీటీకి సైజ్ జీరో సినిమా తర్వాత సినిమా అవకాశాలు రావడం లేదనేది వాస్తవం. ఆ సినిమా కోసం స్వీటీ విపరీతంగా బరువు పెరిగింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి.

అయితే 2020 సంవత్సరంలో అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ  సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ చిన్నది ప్రస్తుతం రారా కృష్ణ‌య ఫేమ్ పి మ‌హేష్ ద‌ర్శక‌త్వంలో  సినిమా తీసేందుకు సిద్దమైందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క మునుపెన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికోసమే స్వీటీ వర్కౌట్స్ కూడా మొదలు పెట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. సన్నగా మారి తన అభిమానులను అశ్చర్యపరచడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలా మారిపోతేనన్నా స్వీటికీ మునపటిలా అవకాశాలు వెల్లువెత్తుతాయో లేదో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: