పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా "వకీల్ సాబ్" టీజర్ తో అభిమానులకు సంక్రాంతి కానుకను అందించాడు. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది హిందీలో హిట్టైన "పింక్" మూవీకు తెలుగు రీమేక్. హిందీలో వకీల్ పాత్రలో అమితాబ్ బచ్చన్ జీవించాడు. అమితాబ్ నటనకు ప్రశంసలు దక్కాయి.

ఇప్పుడు, ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ జీవిస్తున్నాడని తెలుస్తోంది. టీజర్లో పవన్ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. "కోర్టులో వాదించడమూ తెలుసు కోటు తీసి కొట్టడమూ తెలుసు" అన్న డైలాగ్ అభిమానులకు బాగా రీచయింది. పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. పవన్ రీ ఎంట్రీ అనేది అభిమానులకు ఎంతో క్యూరియాసిటీను కలిగిస్తోంది.

ఇదిలా ఉంటే, పవన్ ఇప్పుడు బోలెడన్ని ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నాడు. స్టెప్ బై స్టెప్ ఒకదాని తరువాత ఒకదానిపై దృష్టిపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఓ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే క్రిష్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కుతోందన్న న్యూస్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

రీసెంట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను ప్రస్తుతం పవన్ హోల్డ్ లో ఉంచాడని తెలుస్తోంది. ఆల్రెడీ, కొంత షూట్ జరిగిందట. తాత్కాలికంగా ఈ సినిమాకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో చార్మినార్ అలాగే మచిలీపట్టణం పోర్ట్ సెట్ లను భారీ రేంజ్ లో రూపొందించారట. ఈ సినిమాకి సంబంధించిన కీలకసన్నివేశాలను చిత్రీకరించారట. ఐతే, ఇప్పుడు ఈ సెట్స్ ను తొలగిస్తున్నారని టాక్.  

ప్రస్తుతం, పవన్ కళ్యాణ్ మలయాళం డ్రామా "అయ్యప్పనుమ్ కోషియుమ్" రీమేక్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడట. ఈ రీమేక్ సినిమా పూర్తయ్యాకే క్రిష్ రీమేక్ పై దృష్టి పెట్టాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో, క్రిష్ ఇంకో మూడు నెలలు పవన్ డేట్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: