ఇప్పటికే లూసీఫర్ రీమేక్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ సినిమా తర్వాత అజిత్ హీరోగా కోలీవుడ్లో తెరకెక్కిన మాస్ హిట్ వేదాళం రీమేక్ కూడా ప్రారంభమవుతుందన్న వార్తలు ఉన్నాయి. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లతో రికార్డులు క్రియేట్ చేసిన మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు అంటూ ఒక్కటే ప్రచారం జరిగింది. మెహర్ రమేష్ పేరు చెపితేనే ఏ హీరో కూడా దగ్గరకు రానిచ్చే పరిస్థితి. అలాంటి దర్శకుడితో చిరంజీవి సినిమాయా ? అన్న డౌట్లు ఇండస్ట్రీలో రైజ్ అయ్యాయి.
అప్పుడెప్పుడో షాడో సినిమా తీసిన తర్వాత మళ్లీ మెహర్ రమేష్ ఒక్క సినిమా కూడా తీయలేదు. కేవలం సామాజిక కోణంలోనే రమేష్ను చిరు దగ్గరకు రానిచ్చారా ? అందుకే ఛాన్స్ ఇచ్చారా ? అన్న చర్చలు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు మెహర్ రమేష్ను తన చుట్టూ తిప్పించుకున్న చిరు హ్యాండ్ ఇచ్చేశాడని అంటున్నారు. వేదాళంలో చాలా హెవీ ఫైట్స్ తో పాటు డ్యాన్స్ నంబర్స్ ఉండడంతో ఈ వయస్సులో అంత వర్కవుట్లు చేయలేనని మెహర్కు చిరు సింపుల్గా చెప్పేశాడట.
దీంతో మెహర్ రమేష్కు మెగాస్టార్ నుంచి ఊహించని దెబ్బ పడిందనే చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. మెగాస్టార్ చుట్టూ రెండేళ్ల పాటు తిరిగిన రమేష్కు మళ్లీ ఎవరు ఛాన్స్ ఇస్తారో ? చూడాలి.