మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా న‌ర‌సింహా రెడ్డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత చిరంజీవి న‌టిస్తోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తేజ్ కూడా సిద్ధా పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. ఈ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా ఇటీవ‌ల రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చిరు వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నారు.

ఇప్ప‌టికే లూసీఫ‌ర్ రీమేక్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంది. ఈ సినిమా త‌ర్వాత అజిత్ హీరోగా కోలీవుడ్‌లో తెర‌కెక్కిన మాస్ హిట్ వేదాళం రీమేక్ కూడా ప్రారంభ‌మ‌వుతుంద‌న్న వార్త‌లు ఉన్నాయి. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ల‌తో రికార్డులు క్రియేట్ చేసిన మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు అంటూ ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. మెహ‌ర్ ర‌మేష్ పేరు చెపితేనే ఏ హీరో కూడా ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి. అలాంటి ద‌ర్శ‌కుడితో చిరంజీవి సినిమాయా ? అన్న డౌట్లు ఇండ‌స్ట్రీలో రైజ్ అయ్యాయి.

అప్పుడెప్పుడో షాడో సినిమా తీసిన త‌ర్వాత మ‌ళ్లీ మెహ‌ర్ ర‌మేష్ ఒక్క సినిమా కూడా తీయ‌లేదు. కేవ‌లం సామాజిక కోణంలోనే ర‌మేష్‌ను చిరు ద‌గ్గ‌ర‌కు రానిచ్చారా ? అందుకే ఛాన్స్ ఇచ్చారా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డిచాయి. అయితే ఇప్పుడు మెహ‌ర్ ర‌మేష్‌ను త‌న చుట్టూ తిప్పించుకున్న చిరు హ్యాండ్ ఇచ్చేశాడ‌ని అంటున్నారు. వేదాళంలో చాలా హెవీ ఫైట్స్ తో పాటు డ్యాన్స్ నంబ‌ర్స్ ఉండ‌డంతో ఈ వ‌య‌స్సులో అంత వ‌ర్క‌వుట్లు చేయ‌లేనని మెహ‌ర్‌కు చిరు సింపుల్‌గా చెప్పేశాడ‌ట‌.

దీంతో మెహ‌ర్ ర‌మేష్‌కు మెగాస్టార్ నుంచి ఊహించ‌ని దెబ్బ ప‌డింద‌నే చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్నాయి. మెగాస్టార్ చుట్టూ రెండేళ్ల పాటు తిరిగిన ర‌మేష్‌కు మ‌ళ్లీ ఎవ‌రు ఛాన్స్ ఇస్తారో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: