ప్రస్తుతం నేషనల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం కమిటైనా సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. ప్రస్తుతం చివరి దశలో ఉన్న "రాదే శ్యామ్" దాదాపు 200 కోట్లతో వింటేజ్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామాయణ ఇతిహాస కథాంశంతో తెరకెక్కే "ఆది పురుష్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపుగా 200 నుండి 250 వరకు ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాతో పాటుగా కేజీఎఫ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" చిత్రం చేయనున్నాడు. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాస్ హీరోయిజం ఓ రేంజ్ లో చూపించే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి సిని అభిమానికి అంచనాలు లో తారా స్థాయికి చేరాయి. ఈ సెన్సేషనల్ చిత్రం మాఫియా తరహాలో ఉంటుంది అని ఆ మధ్య టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమం కూడా ఈ మధ్యనే మొదలు కావడంతో సినిమాకు సంబంధించి పలు విషయాలు బయటకు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు కేజీయఫ్ మూవీకి పని చేసిన టెక్నిషియన్స్ పని చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సలార్ చిత్రం కూడా కేజిఎఫ్ తరహాలో మైనింగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని సమాచారం కేజిఎఫ్ సినిమాలో  గోల్డ్ మైనింగ్ గురించి ఉండగా.. సలార్ లో కోల్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తుంది. కానీ అది మేజర్ పార్ట్ అయితే కాదు అని తెలుస్తుంది. ఇప్పటికే పోస్టర్ ను చూస్తే డార్క్ గా డిజైన్ చేశారు. కాస్త కేజీయఫ్ పోస్టర్స్ కూడా అలానే అనిపిస్తాయి. మరి నీల్ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: