సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ స్థాయి క్రేజ్, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి అంటే వారి వారి అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా థియేటర్స్ వద్ద విపరీతంగా సందడి చేస్తూ ఉంటారు. ఒకరిని మించేలా మరొకరు భారీ క్రేజ్ తో కొనసాగుతున్న ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కొన్నేళ్ళ క్రితం ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నారనే విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి.

ఆ సినిమానే ఇడియట్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వైష్ణో అకాడమీ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రక్షిత హీరోయిన్ గా నటించగా దిగంత సంగీత దర్శకుడు చక్రి దీనికి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. రిలీజ్ తర్వాత ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంతో హీరోగా రవితేజకి విపరీతమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆపై మరొకసారి రవితేజ తోనే పూరి తీసిన అమ్మ నాన్నతమిళ అమ్మాయి సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకని రవితేజ కి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది.

ఇక అక్కడి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోగా వరుస అవకాశాలతో దూసుకెళ్ళారు రవితేజ. అయితే ఇడియట్ మూవీ స్టోరీని ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వినిపించానని అయితే ఆ స్టోరీ ఆయనకు నచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా చేయడం కుదరలేదని, అనంతరం దానిని సూపర్ స్టార్ మహేష్ కి కూడా వినిపించానని, మహేష్ కూడా అప్పటి కమిట్మెంట్స్ కారణంగా చేయలేకపోయారని అనంతరం రవితేజకు దానిని వినిపించగా ఆ కథ ఎంతో నచ్చిన రవితేజ పవన్, మహేష్ ఇద్దరూ పక్కాగా చేయడం లేదు అంటేనే తాను చేస్తానని అన్నట్లు అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో భాగంగా వెల్లడించారు పూరి జగన్నాథ్. ఇక రిలీజ్ తర్వాత భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాని ఆ విధంగా సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇద్దరు కూడా కొన్ని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: