వినయ విధేయ రామ లాంటి భారీ డిజాస్టర్ అందించిన బోయపాటి శ్రీను చెప్పే కథలు ఇక ఎవరూ వినరు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రెండు సినిమాలు హిట్ ఇచ్చిన బాలకృష్ణ ఈయనతో మూడో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జయ జానకి నాయక నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయాలు పక్కన పెడితే బోయపాటి శ్రీను త్వరలోనే తమిళ స్టార్ హీరో సూర్యని దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. 

కొద్ది రోజుల క్రితం బోయపాటి శ్రీను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సబ్జక్ట్ ని  దిల్ రాజుకు వినిపించాడట. దిల్ రాజుకు కూడా ఈ సినిమా బాగా నచ్చడంతో ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే అంశం మీద చాలా రోజుల పాటు చర్చలు జరిపారట. చివరికి ఈ సినిమాలో సూర్యని హీరోగా తీసుకుంటే అటు తమిళ ఆడియన్స్ అలాగే తెలుగు ఆడియన్స్ ని మెప్పించవచ్చని బోయపాటి, దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే దిల్ రాజు సూర్యను సంప్రదించారని, బాలయ్యతో సినిమా పూర్తవగానే బోయపాటి వెళ్లి సూర్యకి కథ చెప్పి వస్తాడు అని అంటున్నారు. ఒకవేళ కథ నచ్చితే కనుక వీలైనంత త్వరగా సూర్యతో సినిమా మొదలు పెట్టేయాలని బోయపాటి శ్రీను అలాగే దిల్ రాజు భావిస్తున్నారు. ఇక గత ఏడాది ఆకాశమే నీ హద్దురా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సూర్య. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కథ బాగా కుదరడంతో కచ్చితంగా సూర్య ఈ కధ ఒప్పుకుంటాడు అని భావిస్తున్నారు బోయపాటి శ్రీను. చూడాలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: