"ఉప్పెన" అనే తెలుగు రొమాంటిక్ మూవీను బుచ్చిబాబు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ తో పాటు కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలోని "నీ కన్ను నీలి సముద్రం" అనే పాట సెన్సేషనల్ హిట్టైంది. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. "ఉప్పెన" అనే ఈ మూవీపై ఆడియెన్స్ లో అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాపై వారు హై ఎక్స్పెక్టేషన్స్ ను పెట్టుకున్నారు. ఇప్పుడు, ఫిలిం ఇండస్ట్రీలోని లేటెస్ట్ బజ్ ప్రకారం బుచ్చిబాబు టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి బంపరాఫర్ ను రిజక్ట్ చేసాడట. వివరాల్లోకి వెళ్తే...

సితార ఎంటర్టైన్మెంట్స్ వారు బుచ్చిబాబును సంప్రదించారట. "ఉప్పెన" షూటింగ్ సమయంలోనే 70 లక్షలను అడ్వాన్స్ గా ఇచ్చారట. ఐతే, ఈ అమౌంట్ ను బుచ్చిబాబు రిజక్ట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు రీజన్ మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్షన్ హౌస్ లో మూవీకు బుచ్చిబాబు కమిట్ అయ్యాడట. కాబట్టి, సితార ఎంటర్టైన్మెంట్స్ కు వర్క్ చేయలేనని సున్నితంగా చెప్పుకొచ్చాడట.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద బుచ్చిబాబు అసిస్టెంట్ గా పనిచేశాడు. బుచ్చిబాబు టాలెంట్ ను గమనించిన ఇండస్ట్రీ వరుస ఆఫర్స్ తో ముంచెత్తుతోంది. ఇక "ఉప్పెన" రిలీజ్ అయ్యాక ఈ యువదర్శకుడు మరింత బిజీగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.  

ఇదిలా ఉంటే, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇందులో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు కృతి శెట్టి కూడా "శ్యామ సింగ రాయ"లో నానీ సరసన నటిస్తోంది.

ఇదిలా ఉంటే, "ఉప్పెన"లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఆల్రెడీ, ఈ సినిమా తమిళ్ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. "మాస్టర్" మూవీ సెట్స్ లోనే ఈ సినిమాలోని విలన్ రోల్ గురించి విజయ్ తో మేకర్స్ డిస్కస్ చేయగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఈ కోలీవుడ్ స్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: