మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ ఇతర ప్రాంతాల్లో కూడా అభిమానులు ఉన్నారు.. అయితే ఆ స్టార్ హీరోలను పిచ్చిగా ఇష్టపడే వీరాభిమానులు కూడా చాలా మందే ఉన్నారు.. ఒక్కోసారి కొందరు వీరాభిమానుల ఆలోచనలు, చేష్టలు ఒకింత వింత గొలపడమే కాకుండా... ప్రత్యేకంగా కూడా నిలుస్తుంటాయి. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్‌టిఆర్‌ అభిమాని చేసిన పని టాక్‌ ఆఫ్‌ ది ఇండిస్టీ అయ్యింది. ఎన్‌టిఆర్‌కి ఒక ఉపకారం చేసిన సదరు అభిమాని ఆయన నుండి రిటర్న్‌ గిఫ్ట్‌ అడిగారు. ఇంతకీ ఎన్‌టిఆర్‌కు ఆ అభిమాని చేసిన సాయం ఏంటి? అడిగిన రిటర్న్‌ గిఫ్ట్‌ ఏంటి? తెలుసుకోవాలనుందా?
 
అయితే, చదివేయండి..ఎన్‌టిఆర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవల ఫైన్‌ వేశారు. నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో పరిమితికి మించి కారు వేగంగా డ్రైవ్‌ చేసిన కారణంగా ఆయనకు రూ.1,035 ఫైన్‌ వేశారు.ఫైన్‌ను ఎన్‌టిఆర్‌ చెల్లించలేదు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఓ అభిమాని ఎన్‌టిఆర్‌ చెల్లించాల్సిన ఫైన్‌ తాను స్వయంగా చెల్లించాడు. తాను చెల్లించిన మొత్తానికి రిటర్న్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టికెట్స్‌ కావాలని సదరు అభిమాని సోషల్‌ మీడియా ద్వారా ఎన్‌టిఆర్‌కు విన్నవించాడు. అది కూడా తనకు దగ్గరగా ఉండే మల్లికార్జున థియేటర్‌, భ్రమరాంబ థియేటర్స్‌లో టికెట్స్‌ ఇప్పించాలని కోరాడు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 దీంతో ఆ అభిమాని ఎవరనే ఆత్రుత అందరిలోనూ మొదలైంది. మరి ఎన్‌టిఆర్‌ తన అభిమాని కోరికను తీరుస్తాడా..?లేదా?అనేది చూడాలి.. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం rrr షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..ప్రస్తుతం క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు జక్కన్న..ఈ షూటింగ్ లో చరణ్, తారక్ ఇద్దరూ పాల్గొంటున్నారు.. ఇక దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.. ఇక సినిమాని అక్టోబర్ నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: