వివాదాస్పద నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి పాపులర్ అయ్యింది. స్టార్ హీరోలు తనని వాడుకొని మోసం చేశారని ఆమె అప్పట్లో తరచూ ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని పచ్చి బూతులు తిడుతూ సోషల్ మీడియా లో నానా రచ్చ సృష్టించింది. శ్రీ రెడ్డి బూతు పురాణం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిపోయి తమిళనాడులో సెటిల్ అయ్యింది. తాను పక్కా తమిళ అమ్మాయిని అని చెప్పుకుంటూ తమిళంలోనే మాట్లాడుతూ షాక్ ఇస్తోంది.

అయితే కొంతకాలం క్రితం శ్రీరెడ్డి టాలీవుడ్ యాక్టర్ల ను టార్గెట్ చేస్తూ పచ్చి బూతులు తిడుతూ ఉండేది. పవన్ కళ్యాణ్ ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసేది. కానీ ఈ మధ్య కాలంలో ఎవరిని తిట్టకుండా తన పనేదో తాను చేసుకుంటోంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి వంటలు ఎలా చేయాలో వీడియో రూపంలో చూపిస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తోంది. శ్రీరెడ్డి పాపులారిటీ వల్ల పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి లక్షల్లో వీక్షణలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు పెట్టిన వంటల ప్రోగ్రాం ఐడియా వర్కౌట్ అయింది. చికెన్, మటన్ రెసిపీ వీడియో లతోపాటు తాను షాపింగ్ చేస్తున్న వీడియోలను కూడా యూట్యూబ్ వేదికగా పోస్ట్ చేస్తోంది.

బ్యూటీ మరియు హెల్త్ టిప్స్ గురించి కూడా వీడియోలు చేస్తోంది. అలాగే తన గార్డెన్ గురించి కూడా ఓ వీడియో పెట్టింది. ఈ విధంగా తన అందాలే పెట్టుబడిగా యూట్యూబ్ లో సరికొత్త బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదిస్తోంది. అలాగే ఫేసుబుక్ వేదికగా అడపాదడపా తన అందాలను విపరీతంగా ఆరబోస్తూ తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటుంది. ఈ మధ్య బాగా ఎక్స్ పోజింగ్ పెంచేసి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఏదేమైనా శ్రీ రెడ్డి ఎవరి జోలికి వెళ్ళకుండా తన పని ఏంటో తాను చేసుకోవడం నిజంగా ఆశ్చర్య పడాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: