పాన్‌ ఇండియన్ సినిమా అనగానే మన మేకర్స్‌ అంతా ముంబయి ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులని పట్టుకొస్తున్నారు. మరిప్పుడు గుణశేఖర్- సమంతల 'శాకుంతలం'  కూడా పాన్‌ ఇండియన్‌ మూవీగానే వస్తోంది. మరి గుణశేఖర్ ఈ సినిమాకి హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ని తీసుకుంటున్నాడా? సౌత్‌ స్టార్‌తోనే పూర్తి చేస్తున్నాడా అనే సందేహాలు సినీ అభిమానుల్లో నెలకొన్నాయి.  

తెలుగులో పాన్‌ ఇండియన్‌ మూవీ అనగానే రాజమౌళి నుంచి నాగ్ అశ్విన్ వరకు అంతా ముంబయి హీరోయిన్స్‌నే తీసుకుంటున్నారు. నార్త్‌ మార్కెట్‌కి ప్లస్ అవుతారని బాలీవుడ్‌ స్టార్స్‌తో నింపేస్తున్నారు. ఈ లెక్కలతోనే 'ఆర్ ఆర్ ఆర్'కి ఆలియా భట్‌ని తీసుకొచ్చాడు రాజమౌళి. ఇక ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాకి దీపికా పదుకొణేని ఒప్పించాడు నాగ్ అశ్విన్.

గుణశేఖర్ 'రుద్రమదేవి' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని 'శాకుంతలం' సినిమా చేస్తున్నాడు. మహాకవి కాళిదాస్ రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. సమంత శకుంతల క్యారెక్టర్‌ ప్లే చేస్తోంది. మరి శకుంతల భర్త దుష్యంతుడి పాత్ర ఎవరు పోషిస్తారు.. పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌కి సెట్‌  అయ్యేలా బాలీవుడ్ హీరోని తీసుకొస్తారా.. లేకపోతే తెలుగు హీరోనే తీసుకుంటారా.. అనేది ఆసక్తికరంగా మారుతోంది.

'శాకుంతలం' సినిమా కొంచెం హీరోయిన్‌ సెంట్రిక్‌గానే నడుస్తుంది. సమంత క్యారెక్టర్‌ హీరోని డామినేట్ చేసే ఛాన్స్‌ ఉంది. మరి స్క్రీన్‌ స్పేస్, బిల్డప్‌లో హీరోయిన్‌ కంటే కొంచెం తక్కువగా ఉండే హీరో పాత్ర పోషించడానికి బాలీవుడ్ స్టార్లు ఒప్పుకుంటారా.. ఒకవేళ తెలుగుహీరోలనే తీసుకోవాలనుకుంటే టాప్‌ హీరోలు ఓకే చెబుతారా అనేది చూడాలి.

మొత్తానికి పాన్ ఇండియన్ ఫిల్మ్ గా శాకుంతలము తెరకెక్కుతోంది. అక్కినేని కోడలు సమంత శకుంతల క్యారెక్టర్ ప్లే చేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తోన్న శాకుంతలములో.. దుష్యంతుడి పాత్రకి బాలీవుడ్ హీరోను తీసుకుంటారా అనే సందేహాలు నెలకొంటున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: