ఏం మాయ చేశావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదేమో. అందులోనూ అక్కినేని కోడలుగా.. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ చిన్నది. అంతేకాక తన నటనతో టాలీవుడ్ లో టాప్ కథానాయికగా చెలామణి అవుతూ రాజ్యమేలుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఆహా  ప్లాట్ ఫాం వేధికగా టాక్ షో కు యాంకర్ గా కూడా మారిపోయింది ఈ చిన్నది. దీనితో పాటుగా ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా కూడా వ్యవహరిస్తూ భారీగానే సంపాదిస్తోంది అక్కినేని సమంత. ఈ చిన్నది ఈ మధ్యన సోషల్ మీడియా వేధికగా గ్లామర్ షో చేస్తోంది. హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో కుర్రకారుకు సెగలు పుట్టించే దుస్తులను ధరించి అందరు హీరోయిన్లలాగా గ్లామర్ షోకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది సామ్.
ఈ మధ్యన సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా పాల్గొంటూ తన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఇంతకు మునుపు కూడా కిల్లింగ్ లుక్ తో ఉంటే ఫోటోలను షేర్ చేసిన సామ్ తాజాగా మరో కొత్త ఫోటోను కూడా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిన్నదానికి డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ తో నాలుగేండ్ల పరిచయం అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. ఆ ఫోటోలో సమంత తన రెండు కాళ్లను డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ ఒళ్లో కాళ్లు పెట్టి పడుకుంది. ఈ ఫోటోపై నెటిజన్లు తమకు తోచినవిధంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏంటి సామ్ అలా అతని ఒడిలో కాళ్లు అలా పెట్టేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అలాగే ఈ బ్యూటీ ఈ మధ్యన గ్లామర్ షో ఫోటోలను కూడా షేర్ చేసి అక్కినేని అభిమానుల నుంచి విమర్శలకు గురైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కినేని సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. దీనికోసమే కొన్ని రోజుల కిందట ముంబై చేరుకుంది. ముంబై లో తన ఫ్రెండ్స్ లో  ఫుల్ చిల్ అవుతూ రచ్చరచ్చ చేస్తోంది. వాటికి సంబంధించిన అందమైన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేసింది. కాగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సామ్ దాచుకోకుండా ప్రతి ఒక్కటీ షేర్ చేస్తూ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: