సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ఓకే చేసుకోని వంశీ పైడిపల్లి పవన్కు ఓ కథ చెప్పడానికి రెడీగా ఉన్నాడని టాక్. దీని కోసం ఇప్పటికే పవన్ను ఒకటి, రెండుసార్లు కలిశాడని కూడా తెలుస్తుంది. అయితే కథ కానీ, పాయింట్ కానీ చెప్పే అవకాశం రాలేదని సమాచారం. వంశీకి కొంతమంది నిర్మాలతో కమిట్మెంట్స్ ఉన్నాయి… అయితే సరైన హీరో కోసం వెయిటింగ్ అట. ఆ హీరో పవన్ అని వంశీ అనుకుంటున్నాడట. దీని కోసమే ఓ కథ లైన్ను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. పవన్కు చెప్పి ఓకే చెప్పి సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నాడట.
పవర్ స్టార్ ప్రస్తుతం క్రిష్ తో చేస్తున్న సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా వంశీ… సెట్స్కి వెళ్లి పవన్ను పలకరించి వచ్చాడట. అయితే బిజీ షెడ్యూల్లో పవన్కు కొత్త కథలు వినే పరిస్థితి లేదట. ఒకవేళ పవన్ కథ విని ఓకే చేసినా… సినిమా పట్టాలెక్కాలంటే వంశీ ఓ రెండుమూడేళ్లు ఆగాల్సిన పరిస్థితి. చూద్దాం పవన్ ఎప్పుడు కథ వింటాడో.. అసలు వింటాడో లేదో. ఒకవేళ ఓకే అయితే ఈలోపు వేరే సినిమా చేసుకొని… పవన్ సినిమా కథని సిద్ధం చేసుకుంటాడో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..