ప్రస్తుతం తెలుగులో అగ్ర హీరోల ఫేవరేట్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ రష్మీక మందన్న..గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దోసుకుపోతున్న రష్మికకు తాజాగా అనుకోని షాక్ తగిలింది. ప్రస్తుతం రష్మిక చేతిలో అల్లు అర్జున్,.. 'పుష్ప' సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.అటు శర్వానంద్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. దాంతో పాటు పలు కన్నడ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ భామ.. బాలీవుడ్‌లో సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న 'మిషన్ మజ్ను'సినిమాలో నటిస్తోంది.

 ఈ సినిమాలో బీ టౌన్‌లో కూడా సత్తా చూపెట్టాలని చూస్తోంది.తాజాగా ఈ భామకు అనుకోని షాక్ తగిలింది. అది కూడా గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నుంచి. ఎలా అని ఆశ్యర్యపోతున్నారా.. రీసెంట్‌గా రష్మిక మందన్నకు సూర్య సరసన ఓ సినిమాలో బంపరాఫర్ వచ్చింది.తీరా షూటింగ్ మొదలయ్యే టైమ్‌కు రష్మిక ప్లేస్లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు. సడెన్‌గా ఎంతో క్రేజ్ ఉన్న రష్మికను ఈ సినిమా నుంచి తప్పించడానికి పెద్ద రీజనే ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం రష్మిక డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఆమె చెప్పిన పారితోషకం ఎక్కువగా ఉండటంతో వెంటనే రష్మికను తప్పించిన...

 ఆమె ప్లేస్‌లో ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకున్నారు. మొత్తంగా పూజా హెగ్డేతో సమానంగా తెలుగులో అవకాశాలు కొల్లగొడుతున్న రష్మికకు ఇప్పుడు మరో హీరోయిన్ చెక్ పెట్టడంతో.. ప్రస్తుతం ఈ వార్త అటు కోలీవుడ్ ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది..ఇక ఈ కన్నడ హీరోయిన్ అతి త్వరలోనే బాలీవుడ్ ఇండ్రస్టీ కి అడుగుపెట్టనుంది.. హిందీలో రష్మీకకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఇప్పటికే ఈమె రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ కూడా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: