డార్లింగ్ ప్రభాస్ హవాను మునుపెన్నడూ లేనంతగా కొనసాగిస్తున్నాడు. అసలు 24 గంటల టైం టేబుల్ కూడా సరిపోవడం లేదు ఈ ఆరడుగుల అందగాడికి. వరుస సినిమాలు ప్రకటించి టైమే లేనంత బిజీగా మారిపోయాడు. వరుస ప్రాజెక్ట్ షెడ్యూల్లో పాల్గొంటూ ఈ హీరోకు అసలు సమయమే కరువైందంటే నమ్మండి. ప్రస్తుతం ఈ హీరో చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అందులో ‘రాధేశ్యామ్’ సినిమా  షూటింగ్ చివరి దశకు వచ్చింది. అయితే ఈ సినిమా పూర్తి కాకమునుపే డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న‘సలార్’ సినిమాను కూడా స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా జరగబోతోంది.
ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానో ప్రభాస్ మరో సినిమాకు కూడా శ్రీకారం చుట్టాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న పౌరాణిక సినిమా‘ఆదిపురుష్’ ను కూడా సెట్స్ పైకి తెచ్చాడు ప్రభాస్. ఈ మూవీ కోసం ప్రభాస్ తన కాల్షీట్ నుంచి 60 రోజులను కూడా దీనికోసం కేటాయించాడట. ఈ మూడింటితో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ మూవీని తెరపైకి తేబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ దీపిక పదుకొనేతో హీరో ప్రభాస్ రొమాన్స్ చెయ్యబోతున్నాడు. భారీ బడ్డెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు.

 ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి  అదిరిపోయే  అప్ డేట్ ను సంక్రాంతి తర్వాత ఇస్తానని అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. కాగా లేటెస్ట్ గా రెండు దుమ్ములేపే అప్టేడ్స్ ను ఇవ్వనున్నట్టు తెలిపాడు డైరెక్టర్. ఇందులో ఒకటి జనవరి 29 న ఇవ్వగా.. మరొకటి ఫిబ్రవరి 26 న ఇవ్వనున్నానని తెలిపారు డైరెక్టర్ . దీంతో సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగుతోంది. అసలు ఏమిస్తాడబ్బా అని.. అయితే చాలా మంది అనుకుంటున్నది ఏమంటే ఇక అప్ డేట్ షూటింగ్ ప్రారంభమయ్యేది ఉంటే.. మరోటి ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేశారో అదే విషయం అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ రెండు అప్టేడ్ ద్వారా అభిమానులకు ఏం తెలియజేస్తారనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: