ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అలానే దీని తర్వాత మెహర్ రమేష్, బాబీ ల దర్శకత్వంలో కూడా మెగాస్టార్ మరొక రెండు సినిమాలు చేయనున్నారు. నిన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన తదుపరి చేయబోయే నలుగురు దర్శకులతో కలిసి దిగిన ఫోటో ని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.
ఈ కెప్టెన్స్ తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది తప్పకుండా వారికి మంచి విజయాలు దక్కాలి అని కోరుకుంటూ మెగాస్టార్ పోస్ట్ చేసిన ఆ ఫోటో పై స్పందించిన కొరటాల శివ చిరంజీవి గారు, మీరు కెప్టెన్స్ కె కెప్టెన్, మీ వంటి వ్యక్తితో పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ కొరటాల పెట్టిన పోస్టు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఆచార్య సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.....!!