ఐశ్వర్య రాజేష్, తన చిన్న తనం లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ ముద్దు గుమ్మా తమిళం లో 25 సినిమాలకి పైగా నటించింది, తన టాలెంట్ తో హిందీ లో కూడా పలు చిత్రాల్లో అవకాశాలు సంపాదించుకుంది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ సినిమాల్లో నటించింది. గతేడాది తెలుగులో సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సరసన క్రాంతి మాధవ్ వరల్డ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది. తెలుగు బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగులో హీరోగా మెప్పించిన రాజేష్ కూతురు. అలాగే లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్కు మేనత్త అవుతోంది. తమిళ టీవీ చానెల్లో ఓ రియాలిటీ షో ద్వారా ఐశ్వర్య తన కెరీర్ను ప్రారంభించారు. 2010లో ‘నేతన్ అవన్’ సినిమాతో హీరొయిన్గా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్.
ఇక తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తో ఐశ్వర్య ఎక్కువ గా పాపులర్ అయ్యింది కానీ ఆమె చిన్నప్పుడే బాల నటి గా తెలుగు సినిమాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ సినిమా “రాంబంటు” లో ఐశ్వర్య బాలనటి గా చేసింది. ఆ సినిమాలో ఓ చిలిపి సంఘటనను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికి గుర్తుచెసుకుంటారు. ఐశ్వర్య కు ముద్దు పెట్టె సిన్ చిత్రీకరిస్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ముద్దు పెట్టినప్పుడు ఐశ్వర్య దానిని తుడిచేసుకునేదట. ఆ సన్నివేశంలోపదిహేనుసార్లు ఆయన ముద్దు పెట్టడం తో అలా 15 సార్లు ఈమె తుడిచేసుకుందట, రాజేంద్రప్రసాద్ సరదాగా ఆ విషయాన్ని అప్పడప్పుడు గుర్తుచేసుకుంటారు