రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అతి త్వరలో తెరకెక్కనున్న సినిమా సలార్. హోమ్ బలే ఫిలిమ్స్ బ్యానర్ పై కొన్ని వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమాలో పలు భాషలకు చెందిన దిగ్గజ నటులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమాలోని కొన్ని పాత్రలకై కొత్త నటుల కోసం ఒక క్యాస్టింగ్ కాల్ ని ఇచ్చింది మూవీ యూనిట్. మరోవైపు ఈ సినిమాకు పని చేయనున్న సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తికావచ్చింది అని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా డాన్ గా ఎంతో వైలెంట్ పాత్రలో కనిపించనున్నారని, కాగా ఈ పాత్ర ఎప్పటికీ ప్రేక్షకాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఎంపికయ్యారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చేస్తున్న ప్రభాస్ అనంతరం సలార్ తో పాటు ఆదిపురుష్ అలానే నాగ అశ్విన్ సినిమాలకు కూడా డేట్స్ కేటాయించారని, వాస్తవానికి ముందుగా సలార్ పూర్తి చేసి ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా ఆపై ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేయాలని అనుకున్నారట ప్రభాస్.

అయితే ప్రస్తుతం సలార్ విషయమై ఇంకా కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మిగిలి ఉండటంతో ముందుగా నాగ అశ్విన్ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని ఆ తర్వాతనే ఆయన సలార్ షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. దీనిని బట్టి రాధేశ్యామ్ తరువాత నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా రిలీజ్ అవుతుందని ఆ తర్వాతనే సలార్, అలానే ఆపై ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ప్రచారము అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని మరోవైపు ఈ మూడు సినిమాల్లో ముందుగా సలార్ రిలీజ్ అవుతుందని భావిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒకింత ఊహించని షాక్ అని అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: