కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబీ’ మూవీ జెడి చక్రవర్తి కెరియర్ కు ఏమాత్రం సహకరించకపోయినా సింగర్ సునీత కెరియర్ కు మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది ఆమూవీలో సునీత పాడిన ‘ఈ వేళలో’ అనే పాట ఇప్పటికీ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో ఆపాట సూపర్ హిట్ కావడంతో ఈపాట తరువాత సింగర్ గా ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు.


కొన్నివేల సినిమా పాటలతో పాటు కొన్నివందల సినిమాలకు ఆమె డబ్బింగ్ చెప్పింది. ఈమధ్య ఆమె ప్రముఖ వ్యాపార వేత్త రామకృష్ణను పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఈపెళ్ళి తరువాత అనేక మీడియా సంస్థలు ఆమెతో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈనేపధ్యంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత హీరోయిన్స్ కెరియర్ పై చేసిన వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


సునీతకు గతంలో హీరోయిన్ గా అనేక అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె ఆ అవకాశాలను పట్టించుకోకుండా సున్నితంగా తిరస్కరించింది. ఇప్పుడు మళ్ళీ ఈఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన వచ్చి ఇప్పుడు పెళ్ళిచేసుకుని సెటిల్ అయ్యారు కాబట్టి సినిమాలలో నటించే అవకాశం వస్తే మళ్ళీ నటిస్తారా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆమె ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చింది.


ప్రశాంతంగా ఉన్న జీవితం అనవసరంగా మార్చడం ఎందుకు అంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అంటూ జోక్ చేసింది. వాస్తవానికి సునీత తన జీవితం గురించి మాత్రమే మాట్లాడింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివిగా ఉండే నటిజనులకు ఆమాటలను వేరే అర్థాలు వెతుకుతున్నారు. సునీత మాటల ప్రకారం హీరోయిన్ అవ్వడం అంటే ప్రశాంతత కోల్పోవడమే అన్న అర్థం ఆమె మాటలలో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు అమ్మాయిలు చాల అందంగా ఉన్నా ఫిలిం ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతున్న పరిస్థితులలో సునీత కామెంట్స్ విని మరింత భయపడిపోతారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: