మెగా కాంపౌండ్ లో ఎంతమంది హీరోలు అంటే కచ్చితంగా డజన్ కి దగ్గరగానే ఉన్నారని చెప్పాలి. ఈ హీరోలు అందరూ కూడా ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తారు. అందుకే మెగా కాంపౌండ్ అంటే అంత స్ట్రాంగ్ అని చెబుతారు.

అంతే కాదు ఒక్కసారి ఏ హీరోయిన్ అయినా  ఈ కాంపౌండ్ లోకి అడుగుపెడితే కచ్చితంగా అరడజన్ సినిమాలు చేతిలో ఉంటాయి. ఇపుడు అదే పనిలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఉంది  మరి. ఆమె మొదటి సినిమా ముకుందతో మెగా ప్రిన్స్ వరుణ్ తో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత చాన్నాళ్ళకు మళ్ళీ గద్దలకొండ గణేష్ తో అదే వరుణ్ తో జత కట్టింది. అది కూడా హిట్. ఇక‌ ఆమె అల్లు అర్జున్ తో కూడా రెండు సినిమాలు చేసింది.

అందులో ఒకటి దువ్వాడ శ్రీను అయితే రెండవది  అల వైకుంఠపురంలో. ఇక రామ్ చరణ్ తో కూడా ఈ అమ్మడు జత కడుతోంది. రంగస్థలం మూవీలో జిగేల్ రాణీగా మారి ఐటెం సాంగ్ చేసిన పూజా హెగ్డే ఇపుడు ఆచార్య మూవీతో ఏకంగా రామ్ చరణ్ పక్కన పూర్తి నిడివి ఉన్న పాత్రనే పోషిస్తోంది అంటున్నారు.

మొత్తానికి ముగ్గురు మెగా హీరోల పక్కన రెండేసి వంతున అరడజన్ మూవీస్ చేసిన పూజా హెగ్డే ఇక మెగా కాంపౌండ్ లో మిగిలి ఉన్న హీరోలతో కూడా మూవీస్ చేయాల్సి ఉంది. మరి ఆ లెక్కలు కూడా సరిచేయడానికి జిగేల్ రాణి రెడీగానే ఉందిట. అంటే తెలుగులో పూజా హెగ్డే కెరీర్ లో మరిన్ని సినిమాలు వస్తాయి అంటే అవి కచ్చితంగా మెగా హీరోల నుంచే అని చెప్పాల్సిందే అంటున్నారు. మరి బాలీవుడ్ కి ఎంతగా పరిమితం అవుదామనుకున్నా మెగా హీరోల సినిమా అంటే మాత్రం టాలీవుడ్ కి పూజా హెగ్డే వచ్చి వాలడం బట్టి చూస్తే ఈ అమ్మడు మెగా కాంపౌండ్ కి ఇస్తున్న ప్రయారిటీ తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: