టాలీవుడ్ లో పాటలకు ఎంత ప్రత్యేకత ఉంటుందో అవి పాడే  సింగర్లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది.. వారికీ, వారి గాత్రానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు. అలా వందలపాటలతో అందరి మదిలో చోటు సంపాదించుకున్న సింగర్ సునీత..  పలు భాషల్లో వేలకొద్దీ పాటలు పాడిన సింగర్ సునీత ఇటీవలే ఓ మీడియా వ్యక్తిని పెళ్లి చేసుకుని మళ్ళీ తన సంసారం జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. గతంలో కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

అయితే వారిద్దరి మధ్య అభిప్రాయం భేదాలతో విడిపోగా చాలారోజులనుంచి పిల్లలతో ఒంటరిగా జీవిస్తుంది సునీత.. అయితే పిల్లలు కలుగజేసుకుని ఆమెకు రెండో పెళ్లి చేయగా రామకృష్ణ అలియాస్ మ్యాంగో రామ్ అనే మీడియా పర్సన్ ని పెళ్లి చేసుకున్నారు.. సునీత సింగర్ మాత్రమే కాదు ఆమె హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పిన విషయం తెలిసిందే.. చాల సినిమాలకు ఆమె చెప్పగా ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యాయి కూడా.. అయితే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె తెలుగు ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేశారని చెప్పొచ్చు..

ఈనేపథ్యంలో ఆమె మొదటి భర్త ఎవరు, ఏం చేశేవారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..నిజం చెప్పాలంటే సునీత మొదటి భర్త గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సునీత మొదటి పెళ్లి కూడా సినిమా స్టైల్ లోనే జరిగింది. అది కూడా కేవలం 19 ఏళ్ళ వయసులోనే ప్రేమించి ఇంట్లో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పెద్దవారు ఒప్పుకొని ఆశీర్వదించారు. ఈమె మొదటి భర్త పేరు కిరణ్. ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. సునీత గాయనిగా పరిచయం అయిన తర్వాత ఆమెకు ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. ఇదిలా ఉంటే ఈమెకు 17 ఏళ్ళున్నపుడే కిరణ్లవ్ యూ చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఒప్పుకోలేదు. దాదాపు ఏడాదిన్నర తిరిగిన తర్వాత ఓకే చెప్పింది. కానీ అప్పటికి కూడా ఆమె వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక అనుకోని కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సునీత పిల్లలే లోకంగా పెరిగారు.





మరింత సమాచారం తెలుసుకోండి: