శర్వానంద్  హీరోగా రాబోతున్న సినిమా మహాసముద్రం.. rx100  సినిమా తో తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ సినిమా తర్వాత రెండో సినిమా గా ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. అయితే మొదటి సినిమాకన్నా రెండో సినిమా కోసం అయన చాలా ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. మహాసముద్రం అనే  ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది..

ఇప్పుడు అదే కథను శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడు అజయ్.. ఇకపోతే శర్వానంద్ దీనికంటే ముందు శ్రీకారం సినిమా ని రిలీజ్ చేయనున్నాడు.. తొలిసినిమానుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు.. మంచి అనుభూతిని ఇచ్చే నటనకు శర్వానంద్ కేర్ అఫ్ అడ్రస్.. న్యాచురల్ స్టార్ నాని తర్వాత సెకండ్ టైర్ హీరోల్లో శర్వా రెండో స్థానం అని చెప్పొచ్చు.. అలాంటి శర్వానంద్ గత కొన్ని సినిమాలు గా ఫ్లాప్ లని ఎదుర్కొంటున్నాడు..  దాంతో శ్రీకారం పై మంచి హోప్స్ పెట్టుకున్నాడు. తాజాగా శ్రీకారం సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది.

శ్రీకారం సినిమాను మార్చ్ 11న విడుదల చేయాలనీ దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.అన్ని ఉద్యోగాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో.. వ్యవసాయానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలనే సందేశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. లైన్ కాస్త పాతదే అనిపించినా కథాకథనాలు బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే అదే మార్చ్ 11న విడుదలవ్వడానికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయట. మంచు విష్ణు మోసగాళ్లు సినిమా కూడా అదేరోజు రాబోతుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: