మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లు 2012 లో  పెళ్లి బంధంతో ఒక్కటైయ్యారు. వైవాహిక జీవితంలో ఈ జంట అన్యోన్యంగా, ఎంతో సంతోషంతో  ముందుకు సాగుతోంది. పెళ్లైనప్పటి నుంచి మెగా కోడలిగా ఉపాసన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తోంది. అయితే ఈ వీరు కొద్ది రోజుల కిందట పడ్డ ఇబ్బందిని తాజాగా చెప్పుకొచ్చింది చరణ్ వైఫ్ ఉపాసన. ఇబ్బంది అంటే మరేదో కాదండోయ్.. ఈ మధ్యన రామ్ చరణ్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వలనే ఇబ్బంది పడ్డామని ఉపాసన తెలిపింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో ఈ హీరో హోం క్వారైన్ టైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలోనే చెర్రీ కాస్త ఇబ్బంది పడ్డాడని ఉపాసన వెళ్లడించింది. అయితే చెర్రీకి కరోనా రావడంతో ఉపాసన చెర్రీ బాగోగులన్నీ దగ్గరుండి చూసుకుంది. దాంతో నాకు కూడా పాజిటీవ్ రావొచ్చని చెప్పుకొచ్చింది ఉపాసన. కాగా తాను కూడా టెస్ట్ కూడా చేయించుకుంది. అందులో ఉపాసనకు నెగిటీవ్ వచ్చింది. అయినా కానీ ఆమెకు పాజిటీవ్ వచ్చేందుకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని వైద్యులు చెప్పారట. దాంతో ఉపాసన భర్త రామ్ చరణ్ తో పాటుగా హోం క్వారైన్ టైన్ లో ఉండిపోయింది. దాంట్లో భాగంగానే మొదటి రెండు రోజులు మేము చాలా ఇబ్బంది పడ్డామని వెళ్లడించింది ఉపాసన.

కానీ అవేమీ పట్టించుకోకుండా వారి మధ్య ప్రేమ బంధంతో వారు కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్నామని వెళ్లడించారు ఉపాసన.  కాగా కరోనా భారి నుంచి బయటపడ్డ మెగా హీరో రామ్ చరణ్ వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఒకవైపు దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు తండ్రి చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఆచార్య సెట్ లో అడుగుపెడుతున్నాడు. ఉపాసన కూడా అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. సమయమున్నప్పుడల్లా హెల్త్ పరంగా ప్రజలు తీసుకోవాల్సిన చిట్కాలను సోషల్ మీడియా వేధికగా తెలియజేస్తూ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: