తెలుగులో వరుస అవకాశాలతో పూజాహెగ్డే దూసుకెళుతోంది. గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమా హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న ఈ భామ ఇప్పుడు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశం దాదాపుగా ఖరారు అయినట్లే. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ ఆమె వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ కి హాజరు కావచ్చని అంటున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పూజ ఈ సినిమాలో డీగ్లామర్ లుక్ లో కనిపించనుందట. 

పూజ ఈ సినిమాలో ఒక గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది అని అంటున్నారు. ఆ పాత్రకు మరింత న్యాచురల్ లుక్ ఇచ్చేందుకు గాను ఆమెను డస్కీ లుక్ లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పూజా హెగ్డే రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ అన్ని ఫిబ్రవరి మొదటి వారంలో షూట్ చేస్తారని అంటున్నారు. 

వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా దాదాపుగా ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా ఒక తారీకు కూడా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని మే ఏడవ తారీఖున రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి సతీమణి కొణిదల సురేఖ ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: