మెగా స్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల వెనుక పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ ఎంతో ఆసినిమాల విజయానికి సహకరించింది. దీనితో పరుచూరి బ్రదర్స్ చిరంజీవిల మధ్య సాన్నిహిత్యం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆఖరికి చిరంజీవి రాజకీయాల నుండి మళ్ళీ యూటర్న్ తీసుకుని సినిమాల వైపు వచ్చి చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా’ సినిమాల స్క్రిప్ట్ విషయంలో కూడ పరుచూరి బ్రదర్స్ సలహాలు సంప్రదింపులు కొనసాగాయి.


అలాంటి పరుచూరి బ్రదర్స్ ను ఇప్పుడు చిరంజీవి వ్యూహాత్మకంగా పక్కకు పెట్టాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న ‘లూసీఫర్’ రీమేక్ అని అంటున్నారు. ఈమూవీ రీమేక్ స్క్రిప్ట్ విషయంలో సహకరించడానికి రచయిత లక్ష్మీ భూపాల ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


మంచి రచయితగా పేరుగాంచిన లక్ష్మీ భూపాల ‘అలా మొదలైంది’ ‘చందమామ’ ‘సీత’ ‘నేనేరాజు నేనే మంత్రి’ ‘ఓ బేబి’ లాంటి అనేక సినిమాలకు స్క్రిప్ట్ అందించాడు. అయితే ఎందుకనో టాప్ హీరోల దృష్టి ఈ రచయిత పై పడలేదు. కానీ చిరంజీవి మాత్రం పట్టుపట్టి ‘లూసీఫర్’ రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతను లక్ష్మీ భూపాల కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ గా తీసుకున్న ఈ నిర్ణయం పరుచూరి బ్రదర్స్ కు ఊహించని షాక్ అని అంటున్నారు. ‘లూసీఫర్’ రీమేక్ విషయంలో చిరంజీవి ఇప్పటివరకు అనేక సార్లు ఆలోచించి దర్శకులుగా సుజిత్ వినాయక్ లను తప్పించి మోహన్ రాజాను ఎంపిక చేసాడు. ఇప్పుడు రచయిత విషయంలో కూడ చిరంజీవి ఇలా లక్ష్మీ భూపాల కు అవకాశం ఇవ్వడంతో ఈమూవీ సక్సస్ అయితే లక్ష్మీ భూపాల ఒకేసారి స్టార్ రైటర్ గా మారిపోయే ఆస్కారం ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే పరుచూరి బ్రదర్స్ పాత్ర లేకుండా ఉండేవి కావు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరు వారివైపు చూడకపోవడం ఆశ్చర్యకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: