లవర్ బోయ్ నితిన్ లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ అందుకోగా ఈ ఇయర్ నెల గ్యాప్ లో తన రెండు సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. నితిన్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో వస్తున్న చెక్ సినిమా ఫిబ్రవరి 19న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంతకుముందే వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న రంగ్ దే సినిమాని కూడా మార్చ్ 26న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలు 30 రోజుల లోపే రిలీజ్ అవడం విశేషం. భీష్మ హిట్ తో కెరియర్ లో మళ్లీ జోష్ పెంచుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమాల మీద అదే ఫోకస్ తో పనిచేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత నితిన్ కృష్ణ చైతన్య డైరక్షన్ లో పచర్ పేట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ మూడు ఏజ్ గ్రూపుల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్ల వయసు గల వ్యక్తిగా నితిన్ నటిస్తున్నాడట. దీనికి సంబందించిన స్క్రీన్ టెస్ట్ జరగ్గా నితిన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయినట్టు తెలుస్తుంది. నితిన్ ను 60 ఏళ్ల వయసు గల వ్యక్తిగా ఎలా చూపిస్తారు అనుకోవచ్చు అదంతా డైరక్టర్, కెమెరా మెన్ చూసుకుంటారని చెప్పొచు.

ఆల్రెడీ కృష్ణ చైతన్య నితిన్ తో ఛల్ మోహన్ రంగ సినిమా తీశాడు. ఇప్పుడు పవర్ పేటతో ఇద్దరు కలిసి ఓ క్రేజీ సినిమా చేస్తున్నారు. ఇదేకాకుండా నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాధున్ రీమేక్ గా కూడా ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా నితిన్ తన హిట్ మేనియా కొనసాగించేలా రానున్న సినిమాలు ఉన్నాయని చెప్పొచ్చు.                

మరింత సమాచారం తెలుసుకోండి: