చలో సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు వెంకీ కుడుముల. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో భీష్మ అనే సినిమా చేశాక అది కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా అనౌన్స్ చేయలేదు. నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అయినా ఈయన మరో సినిమా అనౌన్స్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈయన చెప్పిన కధ రామ్ కి నచ్చ లేదట. 


సంక్రాంతికి రెడీ అనే మూవీ రిలీజ్ చేసిన రామ్ ఆ తర్వాత ఏం సినిమా చేయాలనే దాని మీద దృష్టి పెట్టాడు. ఈ సినిమా సరిగా ఆడక పోవడంతో తరువాత సినిమా మీద ఆయన స్పెషల్ గా ద్రుష్టి పెట్టాడు. త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా లేట్ అయ్యే అవకాశం ఉన్న కారణంగా ఇప్పుడు రామ్ కథలు వింటున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పిన కథను ఓకే చేశాడని ప్రచారం జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు వెంకీ కుడుముల రామ్ కోసం ఒక కథ చెప్పగా ఆ కథను రామ్ తోసిపుచ్చాడు అని అంటున్నారు.


అయితే కథ మీద నమ్మకంతో వెంకీ కుడుముల మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడట. నిజానికి వెంకీ కుడుముల గతంలో త్రివిక్రమ్ దగ్గర పనిచేశాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ రామ్ వరకు ఈ కథ పంపించాడు అని అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రెడ్ రిజల్ట్ చూశాక రామ్ మళ్ళీ జాగ్రత్త పడ్డాడు. అన్ని సినిమాలు ఒప్పేసుకోకుండా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్న సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వెళుతున్నారని అంటున్నారు. అందుకే ఈ సినిమా కధ వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: