మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నతాజా మూవీ ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మొట్టమొదటిసారిగా ఫుల్ లెన్త్ రోల్స్ చేస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆచార్య తర్వాతి షెడ్యూల్ రాజమండ్రికి దగ్గరలోనే ఉన్న మారేడుమిల్లి అడవిలో జరగనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ షెడ్యుల్ ఏడో తారీఖు నుంచి మొదలు కానున్నదట. రామ్ చరణ్, చిరంజీవి మధ్య కీలక సన్నివేశాల షూటింగ్ ఈ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు అని అంటున్నారు.


 ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన పక్కన హీరోయిన్ గా నటించేందుకు గాను పూజా హెగ్డే ని ఎంపిక చేశారని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే చేయనున్నారని అంటున్నారు. అంతే కాక ఈ సినిమాలో ఆమె ఒక కోయ యువతి పాత్రలో నటిస్తోంది అని ఆమెను కూడా డి గ్లామరస్ గా ఉండేలాగా చూస్తున్నారని అంటున్నారు.


ఈ విషయాల మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారిన మరో అంశం ఏమిటంటే తన పుష్ప సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ కూడా మారేడుమిల్లి అడవిలోనే ఉన్నాడు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంది. మధ్య మధ్యలో ఆయన హైదరాబాద్ వచ్చి వెళుతున్నాడు. మొత్తం మీద తమ తమ సినిమాల షూటింగ్ కోసం మెగా హీరోలు ముగ్గురూ మారేడుమిల్లి అడవిలో కలుసుకోనుండడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: