ఈకాలంలో చాలామంది కట్టుకున్న భార్యలను వదిలేసి విడాకులు ఇచ్చి వాళ్ళ సుఖం వాళ్లు చూసుకుంటున్నారు. కానీ ఒక స్టార్ మాత్రం తనకి క్యాన్సర్ అనే మహమ్మారి  వచ్చిందని తెలిసి తన భార్య పిల్లల కోసం ఏకంగా 27 కోట్ల విలువ చేసే నాలుగు ఫ్లాట్లను రాసిచ్చాడు  తెలుసా.. ! ఆ ఆస్తులకి సంబందించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.అసలు  ఇంతకీ ఎవరు ఆ  స్టార్ హీరో అని అనుకుంటున్నారా..?  పూర్తి వివరాల్లోకి వెళితే..ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. మున్నాభాయ్ డిసెంబరులో బహుమతి దస్తావేజు(గిఫ్ట్ డీడ్) చేయించి 26 కోట్ల రూపాయల విలువైన ఒక నాలుగు ఫ్లాట్లను తన భార్య అయిన  మాన్యతకు బహుమతిగా ఇచ్చారు. ఈ నాలుగు ఫ్లాట్లు పాలి హిల్ ఇంపీరియల్ హైట్స్ లో ఉన్నాయి. అయితే ఈ ఆస్థి సంజయ్ కి వారసత్వంగా వచ్చింది.

సంజయ్ దత్ 2020 డిసెంబర్ 3 న ఈ నాలుగు ఫ్లాట్లను మాన్యతకు బహుమతిగా ఇచ్చే డాక్యుమెంటేషన్ను చేయించారు 301.. 401.. 1101 .. 1201 అపార్టుమెంటులను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ప్లాట్స్ అన్నీ 17 కార్ పార్కింగ్ స్పేస్ లు కలిగి ఉన్నాయి. ఈ ఫ్లాట్ల విలువ  దాదాపు 26.46 కోట్ల రూపాయలు. మాన్యత అసలు పేరు దిల్నాషిన్ దత్. ఆ పేరుతోనే ఇవన్నీ రిజిస్టర్ అయ్యాయిట. సంజయ్ దత్ కి మూడో దశ క్యాన్సర్ అన్న సంగతి 2020 ఆగస్టులో బయటపడింది.

క్యాన్సర్ అని తెలిసాక  ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. అక్టోబర్ లో తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. క్యాన్సర్  తో పోరాడటానికి సహకరించిన వైద్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బహుమతి కథనాలపై స్పందించమని కోరితే మాన్యత ఇంతవరకూ స్పందించలేదని తెలిసింది.నిజంగా మున్నాభాయ్ గ్రేట్ కదా.. !!మున్నాభాయ్ చేసిన ఈ పనికి నెటిజన్లు అందరు ఫిదా అవుతున్నారు. !

మరింత సమాచారం తెలుసుకోండి: