సంజయ్ దత్ 2020 డిసెంబర్ 3 న ఈ నాలుగు ఫ్లాట్లను మాన్యతకు బహుమతిగా ఇచ్చే డాక్యుమెంటేషన్ను చేయించారు 301.. 401.. 1101 .. 1201 అపార్టుమెంటులను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ ప్లాట్స్ అన్నీ 17 కార్ పార్కింగ్ స్పేస్ లు కలిగి ఉన్నాయి. ఈ ఫ్లాట్ల విలువ దాదాపు 26.46 కోట్ల రూపాయలు. మాన్యత అసలు పేరు దిల్నాషిన్ దత్. ఆ పేరుతోనే ఇవన్నీ రిజిస్టర్ అయ్యాయిట. సంజయ్ దత్ కి మూడో దశ క్యాన్సర్ అన్న సంగతి 2020 ఆగస్టులో బయటపడింది.
క్యాన్సర్ అని తెలిసాక ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. అక్టోబర్ లో తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. క్యాన్సర్ తో పోరాడటానికి సహకరించిన వైద్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బహుమతి కథనాలపై స్పందించమని కోరితే మాన్యత ఇంతవరకూ స్పందించలేదని తెలిసింది.నిజంగా మున్నాభాయ్ గ్రేట్ కదా.. !!మున్నాభాయ్ చేసిన ఈ పనికి నెటిజన్లు అందరు ఫిదా అవుతున్నారు. !