ఇటీవలె జకన్న టీం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయం పై కూడా క్లారిటీ ఇచ్చింది. కాగా తారక్ అభిమానులు ఎన్టీఆర్ సినిమాల గ్యాప్ ను తట్టుకోలేక పోతున్నారు. థియేటర్లలో మా హీరో సినిమా లేదంటూ తెగ ఫీలవుతున్నారు. అందుకే పాత సినిమాతో తారక్ థియేటర్లను మళ్లీ షేక్ చెయ్యడానికి సిద్దమవుతున్నాడు. కాగా ఈ నెల 28 తేదీన ‘జై లవకుశ’ సినిమా ప్రసాద్ ఐ మ్యాక్స్ లో స్పెషల్ ప్రీమియర్ వెయ్యడానికి సిద్దమయ్యారు. అయితే చూసిన సినిమానే అయినా ఈ సినిమా థియేటర్లలో సందడి చెయ్యబోతుందన్న వార్త తెలిసి తారక్ ఫ్యాన్స్ టికెట్లకు క్యూ కట్టారు.
అందులోనూ ఈ స్పెషల్ ప్రీమియర్ కు టికెట్లు ఓ రేంజ్ లో అమ్ముడు పోయి అందరినీ అశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఎన్టీఆర్. కాగా ఇందులో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేశారు. మూడు డిఫరెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించారు ఎన్టీఆర్. కాగా ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. అయినా థియేటర్లలో చూడటానికి తారక్ అభిమానులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్ అంటే ప్రేక్షకులకు ఎంత అభిమానమో.