ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో యస్ యస్ రాజమౌళి, కొరటాల శివ తరువాత ఎటువంటి ప్లాపులు ఎదుర్కొనటువంటి దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి అనే చెప్పాలి. వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి.. ఇక తన సినిమాలు  ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా ఇతను తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లే..! పక్క కమర్షియల్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో  తీసిన  "సరిలేరు నీకెవ్వరూ" సినిమా అనిల్ రావిపూడిని స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేర్చింది. అంతేకాదు ఈ సినిమాతో అత్యంత వేగంగా 200 కోట్ల సినిమా  క్లబ్ లోకి అనిల్ రావిపూడి అడుగు పెట్టాడు. ఇదిలా ఉండగా.. అనిల్ రావిపూడి త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది.

ఈ కుర్ర డైరెక్టర్ ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ ని తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాకి  నిర్మాత. నిజానికి గతేడాదే ఈ చిత్రాన్ని ప్రారంభించి.. ఈ 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వలన కుదర్లేదు. దాంతో సమ్మర్ కు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. అసలు అనిల్ రావిపూడి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నాడు. ఏ హీరోతో ఇవ్వబోతున్నాడు అనేగా మీ డౌట్..? ఇక విషయానికి వస్తే  వెళితే..రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చేస్తున్న రాంచరణ్..ఆ తరువాత అనిల్ డైరెక్షన్లోనే సినిమా చేసే అవకాశం ఉందట. ఆ సినిమా తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేసే విధంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్.

అన్నీ కుదిరితే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్లు కూడా జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ కచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని భావించి చిరు,చరణ్ లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: