"ఏం మాయ చేసావే" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఆ ఆతరవత అక్కిలేని హీరో చైతన్య ను ప్రేమ పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యింది. ఇక ప్రస్తుతం సమంత గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా పాత్ర కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైనా సందడి చేస్తోంది. టాక్ షోలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఎప్పుడూ వర్కౌట్స్ వీడియోలు పోస్ట్ చేసే సమంతను యాంకర్ మీరు జిమ్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు అని ప్రశ్నించింది. దానికి సమాదానం ఇస్తూ సమంత.. నిజానికి నాగచైతన్య కోసమే జిమ్ లో అడుగుపెట్టానని తెలిపింది.

నాగ చైతన్య ఎప్పుడూ జిమ్ లోనే గడుపుతాడాని అందుకే చైతూని పడేయడానికే జిమ్ లో అడుగు పెట్టానని తెలిపింది. 2021 లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అని అడగ్గా ...ఇకపై మొత్తం శాకాహారం తినాలనుకుంటున్నా అని తెలిపింది. ఎక్కువగా ఆకుకూరలు తింటూ ఫిట్నెస్ ను మరింత పెంచుకోవాలని చెప్పింది. తాను నటించిన సినిమాల్లో ఓ బేబీ, ది ఫ్యామిలీ మెన్ సినిమాల్లో పాత్ర అంటే ఇష్టమని వాటిలో ఏదో ఒకటి చెప్పమంటే చెప్పలేను అని వెల్లడించింది. తనపై వస్తున్న ట్రోల్స్ ను లైట్ తీసుకుంటానని తెలిపింది. ఒకప్పుడు బాధపడేదాన్ని కానీ ఇపుడు నేను వ్యక్తిగా ఎదిగాను అని పేర్కొంది. ఇక నాగా చైతన్య ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించరు అని ప్రశ్నించగా...అదే ప్రశ్న నేనూ అడుగుతున్నా ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండవు చైతూ అంటూ క్యూట్ గా అడిగింది సమ్మూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: