ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ల హవా నడుస్తోంది.. యువ హీరోల నుండి మొదలుకొని సీనియర్ హీరోలు సైతం మల్టీస్టారర్ ప్రాజెక్టుల  వైపే మొగ్గుచూపుతున్నారు.. ఇక అగ్ర హీరోలు కూడా చాలా వరకు కుదిరితే పాన్ ఇండియా లేకపోతే మల్టీస్టారర్ సినిమాలు అంటున్నారు. కథ బావుంటే ఏ మాత్రం నో చెప్పడం లేదు. చాలా రోజులుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కాంబోపై కూడా కథనాలు వస్తున్నాయి.హీరోలను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు మహి వి రాఘవ అని తెలుస్తోంది. ఇదివరకు ఈ దర్శకుడు తాప్సితో ఆనందో బ్రహ్మ అనే సినిమా చేశాడు.
 అలాగే వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా..

యాత్ర అనే సినిమా కూడా చేశాడు. రెండు సినిమాలు కూడా దర్శకుడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఈ మల్టీస్టారర్ కథను ఇదివరకే దర్శకుడు మహి వి రాఘవ ఇతర హీరోలకు చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు రిజెక్ట్ చేయడంతో ఎప్పటికప్పుడు మార్పులు బాగానే చేసుకుంటూ వెళ్లాడట. ఇక ఓ ఇద్దరు హీరోలు కాస్త పాజిటివ్ గా స్పందించడంతో 2019లోనే మల్టీస్టారర్ కు సంబంధించిన రూమర్స్ బాగానే వచ్చాయి.హీరోలు మరెవరో కాదు. నాని, విశాల్. గత ఏడాది వరకు కూడా దర్శకుడు వాళ్లనే హీరోలుగా సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఇద్దరు హీరోలు కథలపై కాస్త చెంజెస్ అడగడంతో దర్శకుడి ఆలోచన కూడా మారింది.
 
ఇక ఆ కథను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తే బావుంటుందని ఫిక్స్ అయ్యాడట.బడ్జెట్ కూడా ఎక్కువవ్వడంతో స్టార్ హీరోలను సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ గురించి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లకు చెప్పాడట. వాళ్ళు పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు మరిన్ని మార్పులు చేయాలని మళ్ళీ కొంతమంది రైటర్స్ తో సిట్టింగ్ వేసినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత మరోసారి హీరోలకు వినిపించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: