పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుం కొషియం అనే మలయాళ రీమేక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ లాడ్జ్ సెట్ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తూ స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం నిర్మాణ సంస్థ షూటింగ్ మొదలైంది అంటే ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ ఒక బండి మీద లాడ్జిలో కి వెళుతున్నట్లు చూపించారు. 

అనంతరం పవన్ కళ్యాణ్ పక్కన త్రివిక్రమ్ నడుస్తూ వస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరకంగా త్రివిక్రమ్ లాంటి మంచి దర్శకుడు ఈ సినిమాకు పనిచేస్తుండటంతో ఆనందంగా ఉండాలో, అలాంటి దర్శకుడు ఇచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ ని తలుచుకుని మళ్ళీ ఆయన హ్యాండ్ ఉన్న సినిమా మా హీరో చేస్తున్నాడని ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొందని కొందరు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళు చెప్పేది నిజమే అయినా, పవన్ కళ్యాణ్ ఇలా జయాపజయాలను దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయడు.


సో వీళ్లు ఎన్ని చెప్పినా ఎంత బాధపడినా వృధా ప్రయాసే తప్ప ఉపయోగం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకి నల్లమల్ల అడవుల నేపథ్యం ఉండే లాగా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ అంతా పొల్లాచ్చిలో జరిగినా మనకు చూపించే కథలో మాత్రం నల్లమల అడవుల నేపథ్యం చూపించనున్నారు. ఈ సినిమా కథ ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ఈగో వార్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా రానా రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: